PM Modi : క్రిప్టో కరెన్సీ అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకూడదు

క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు.

PM Modi : క్రిప్టో కరెన్సీ అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకూడదు

Pm Modi

PM Modi : ప్రపంచంలో రోజుకో క్రిప్టోకరెన్సీ పుట్టుకొస్తుంది. అధికారిక లెక్కల ప్రకారం 2000 క్రిప్టోకరెన్సీ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక అనధికారికంగా వీటి సంఖ్య ఇప్పుడు ఉన్నదానికంటే రెండంతలు ఉంటుందని సమాచారం. ఇక ఇప్పటికే పలు దేశాలు క్రిప్టో కరెన్సీకి ఒకే చెప్పాయి. లావాదేవీల్లో క్రిప్టో కరెన్సీని ఉపయోగించేందుకు తాము సిద్దమే అని ఎల్ సల్వడార్ దేశం సెప్టెంబర్ నెలలో తెలిపింది.

చదవండి : Modi Cabinet: మారుమూల గ్రామాల్లోకి 4జీ నెట్‌వర్క్‌.. మోదీ కేబినెట్ కీలక నిర్ణయం

ఇక భారత్‌లో క్రిప్టో కరెన్సీపై యువత ఆకర్షితులవుతున్నారు. అంగట్లో సరుకులా వచ్చి పడుతున్న క్రిప్టో కరెన్సీని కొనేందుకు కొత్త కొత్త యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గవర్నర్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వర్చువల్ కరెన్సీల వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక స్థిరత్వానికి ఇవి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి : PM Modi : పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వే ప్రారంభించిన మోదీ..హైవేపై యుద్ధవిమానాలతో విన్యాసాలు

ఇక ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తొలిసారి ఆ అంశంపై త‌న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చెడ్డ‌వారి చేతుల్లోకి క్రిప్టో క‌రెన్సీ వెళ్ల‌కుండా ప్ర‌పంచంలోని అన్ని ప్ర‌జాస్వామ్య దేశాలు క‌లిసి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నారు. డిజిట‌ల్ క‌రెన్సీపై ఇండియా ఇంకా ఎటువంటి నిర్ణ‌యాన్ని తీసుకోలేదు. కానీ క్రిప్టో వ‌ల్ల యువ‌త చెడిపోయే ప్ర‌మాదం ఉంద‌ని మోదీ అభిప్రాయ‌ప‌డ్డారు.

చదవండి : PM Modi నేడు పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను వినూత్నంగా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ద సిడ్నీ డ‌య‌లాగ్ స‌ద‌స్సులో పాల్గొన్న ఆయ‌న కీల‌కోప‌న్యాసం చేశారు. ఎవల్యూషన్ అండ్ రివల్యూషన్ పై కీలక ప్రసంగం చేశారు. క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలని, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని పిలుపు ఇచ్చారు.