ఝార్ఖండ్ సీఎంపై అత్యాచార ఆరోపణలు..రంగంలోకి మహిళా కమిషన్

ఝార్ఖండ్ సీఎంపై అత్యాచార ఆరోపణలు..రంగంలోకి మహిళా కమిషన్

Jharkhand CM ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​ పై ముంబైకి చెందిన ఓ మోడల్​ చేసిన అత్యాచార ఆరోపణలను సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్​. 2013లో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. సామాజిక మాధ్యమాల్లో మోడల్​ పేరిట ఓ లేఖ వైరల్​గా మారిన మరుసటి రోజునే జాతీయ మహిళా కమిషన్​ ఈ మేరకు స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా, 2013లో హేమంత్​ సోరేన్,సురేష్ నాగ్రే​ తనపై అత్యాచారం చేశారని,అంతేకాకుండా తన తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారంటూ ముంబైకి చెందిన ఓ మోడల్​ ఆరోపణలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశం వైరల్​గా మారింది. పోలీసుల భద్రత కోరుతూ మోడల్​ రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

మీడియా రిపోర్టులను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్​ రంగంలోకి దిగింది. ఈ మేరకు 2013లో నమోదైన కేసుపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు ఎన్​సీడబ్ల్యూ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ. కాగా, ఈ ఏడాది జులైలో గొడ్డా ఎంపీ నిశికాంత్​ దుబే ఈ అంశాన్ని లేవనెత్తారు. అత్యాచార కేసును తిరిగి పునర్విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.