ఝార్ఖండ్ సీఎంపై అత్యాచార ఆరోపణలు..రంగంలోకి మహిళా కమిషన్
Jharkhand CM ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై ముంబైకి చెందిన ఓ మోడల్ చేసిన అత్యాచార ఆరోపణలను సుమోటోగా స్వీకరించింది జాతీయ మహిళా కమిషన్. 2013లో నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. సామాజిక మాధ్యమాల్లో మోడల్ పేరిట ఓ లేఖ వైరల్గా మారిన మరుసటి రోజునే జాతీయ మహిళా కమిషన్ ఈ మేరకు స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా, 2013లో హేమంత్ సోరేన్,సురేష్ నాగ్రే తనపై అత్యాచారం చేశారని,అంతేకాకుండా తన తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారంటూ ముంబైకి చెందిన ఓ మోడల్ ఆరోపణలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశం వైరల్గా మారింది. పోలీసుల భద్రత కోరుతూ మోడల్ రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
మీడియా రిపోర్టులను సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. ఈ మేరకు 2013లో నమోదైన కేసుపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖా శర్మ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్ రేఖా శర్మ. కాగా, ఈ ఏడాది జులైలో గొడ్డా ఎంపీ నిశికాంత్ దుబే ఈ అంశాన్ని లేవనెత్తారు. అత్యాచార కేసును తిరిగి పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
It is also reported that the viral letter, reportedly written by the victim, contains details of incidents that have occurred in the last seven years. NCW Chairperson has written to Maharashtra DGP seeking detailed action taken report of the case which was filed in 2013: NCW https://t.co/ISuOcIxcUB
— ANI (@ANI) December 17, 2020