RBI నయా గైడ్ లైన్స్, క్రెడిట్, డెబిట్ కార్డు దారులు తెలుసుకోవాల్సిన విషయాలు

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 06:45 AM IST
RBI నయా గైడ్ లైన్స్, క్రెడిట్, డెబిట్ కార్డు దారులు తెలుసుకోవాల్సిన విషయాలు

RBI Rules : బ్యాంకింగ్ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఆర్బీఐ (RBI) సరికొత్త గైడ్‌లైన్స్‌ సిద్ధం చేసింది. క్రెడిట్‌, డెబిట్ కార్డులకు మరింత సెక్యూరిటీ కల్పిస్తూ మార్గదర్శకాలను రూపొందించింది. 2020, అక్టోబర్ 01వ తేదీ గురువారం నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నట్లు స్పష్టం చేసింది.



బ్యాంకింగ్ మోసాలకు చెక్
రోజు రోజుకు పెరిగిపోతున్న బ్యాంకింగ్ మోసాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది ఆర్బీఐ. ఇకపై క్రెడిట్ కార్డులను ఇంటర్నేషనల్, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలకు వాడాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ఆర్బీఐ గైడ్‌లైన్స్‌లో రూపొందించింది. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు ఏటీఎంలలోనూ, పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద మాత్రమే పని చేస్తాయని తెలిపింది.



నయా గైడ్‌లైన్స్
రిస్క్ తీసుకునే కస్టమర్లకు వారి నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఖాతాను జత చేస్తారు. అయితే, ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు వర్తించవని ఆర్బీఐ గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. నయా గైడ్‌లైన్స్‌ ద్వారా కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వాడకంపై ముందుగానే పరిమితులను పెట్టుకోవచ్చు.



ఈ పరిమితి దాటి
ఈ పరిమితి దాటి కార్డు ద్వారా లావాదేవీలకి ప్రయత్నిస్తే వెంటనే ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్ ఫోన్ కు సమాచారం అందుతుంది. కస్టమర్లు తమ కార్డులను ఏటీఎం, NFC, POS, ఈ-కామర్స్ లావాదేవీలకు వాడకుండా తాత్కాలికంగానూ నిషేధించుకోవచ్చు. తక్షణమే అన్ని బ్యాంకులు, కార్డులను జారీ చేసే కంపెనీలు డెబిట్, క్రెడిట్ కార్డుల ఆన్ లైన్ చెల్లింపు సేవలను తీసివేయాలని, కార్డు హోల్డర్‌ కోరుకుంటేనే ఆ సౌకర్యాన్ని కల్పించాలని ఆర్బీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి.



రూ. 2 వేల వరకూ
తమ కార్డులను విదేశాల్లో వాడుకోవాలనుకున్నా బ్యాంకు నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది ఆర్బీఐ. ఇక కొత్త కార్డులు జారీ అయితే, వాటి ద్వారా ఎలాంటి సేవలను పొందాలని భావిస్తున్నారో బ్యాంకుకు తెలిపి అనుమతి తీసుకోవాల్సి వుంటుంది. ఇక, ప్రస్తుతం రోజులో రూ. 2 వేల వరకూ పిన్ ను ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ లావాదేవీలను కూడా ఖాతాదారులు నియంత్రించుకోవచ్చు.

కొత్త నిబంధనలతో
ఇక ఈ కొత్త నిబంధనలతో బ్యాంకింగ్‌ మోసాలు తగ్గుతాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ కస్టమర్లకు లాభాలు చేకూర్చేలానే ఉన్నాయి. బ్యాంకింగ్ మోసాలను పూర్తిగా అరికట్టవచ్చు. అలాగే మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన లావాదేవీలు ఇతరులు చేసే ఛాన్స్‌ ఉండదు. ఆర్ధిక క్రమశిక్షణ కూడా అలవాటవుతుంది. మొత్తంగా కస్టమర్లు కూడా ఆర్బీఐ గైడ్‌లైన్స్‌ బాగున్నాయంటున్నారు. గురువారం నుంచి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి.