కరోనా కరాళనృత్యం: 24 గంటల్లో 52వేలకు పైగా కేసులు..
భారత్లో కరోనా కేసులు పెరుగుతున్న వేగం ఇప్పుడు అమెరికా, బ్రెజిల్ మాదిరిగానే మారుతోంది. కరోనా కారణంగా భారత జనాభాలో కనీసం సగం మంది ప్రస్తుతం వివిధ రకాల లాక్డౌన్లో ఉన్నారు. అయినప్పటికీ దేశంలో కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో 24 గంటల్లో కొత్తగా 52,509 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 19,08,255కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 12,82,216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఈ వ్యాధి కారణంగా 857 మంది చనిపోగా.. మొత్తంగా 39,795 మంది రోగులు మరణించారు.
అమెరికా, బ్రెజిల్ తరువాత, అంతకుముందు రోజు భారతదేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కూడా గరిష్ట మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో వరుసగా అంతకుముందు రెండు రోజులు వరుసగా 54,504, 56,411 కేసులు నమోదయ్యాయి. వరుసగా 1,362, 1,394 మరణాలు సంభవించాయి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, దేశంలో మొత్తం సోకిన 19 లక్షల 8 వేల 255మందిలో 5 లక్షల 86 వేల మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంటే మొత్తం సోకిన వారిలో 30.72% క్రియాశీల కేసులు ఉండగా.. 67.19% మంది కోలుకున్నారు. 2.08% మంది మరణించారు.
కరోనా సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. కరోనా మహమ్మారి వల్ల యునైటెడ్ స్టేట్స్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (4,918,420), బ్రెజిల్ (2,808,076) లో ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు పెరిగే వేగం కూడా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.
క్రియాశీల కేసుల విషయంలో గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం ఆరు లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యంత చురుకైన కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. రెండో స్థానంలో తమిళనాడు, కర్ణాటక మూడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో, ఢిల్లీ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యంత చురుకైన కేసులు ఉన్నాయి.
State-wise details of Total Confirmed #COVID19 cases(till 5 August, 2020, 8 AM)
➡️States with 1-4000 confirmed cases
➡️States with 4001-45,000 confirmed cases
➡️States with 45,000+ confirmed cases
➡️Total no. of confirmed cases sofarVia @MoHFW_INDIA pic.twitter.com/hS1K1g0otA
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) August 5, 2020