NIACL Recruitment 2021: 300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 21 వ తేదీ దరఖాస్తులకు
NIACL Recruitment 2021: ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 21 వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ. మొత్తం ఖాళీలు 300.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ పీజీ.
డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
వయసు: 2021 ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : ప్రిలిమ్స్, మెయిన్స్ (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
ఎగ్జామ్ ప్యాటర్న్: ప్రిలిమ్స్ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. పరీక్షకు 60 నిమిషాల సమయం కేటాయించారు.
మెయిన్స్ ఎగ్జామ్: ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్టు (లెటర్ రైటింగ్ 10 మార్కులు, ఎస్సే 20 మార్కులు) ఉంటుంది.
ఈ రెండు పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తారు.
నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కు రూ.100 చెల్లించాలి.
చివరి తేది: 21 సెప్టెంబర్
ఫేజ్1 ఆన్లైన్ ఎగ్జామ్: అక్టోబర్ 2021
ఫేజ్2 ఆన్లైన్ ఎగ్జామ్: నవంబర్ 2021
పూర్తి వివరాలకు.. వెబ్సైట్: www.newindia.co.in