CM Yediyurappa : యడ్యూరప్ప రాజీనామా అంటూ ఊహాగానాలు..క్లారిటీ ఇచ్చిన సీఎం
కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లటం..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పులు..ఆయన రాజీనామా వార్తలపై యడ్యూరప్ప స్పందించారు.
Karnataka CM Yediyurappa on asked if he has resigned : కర్ణాటకలో పలు నాటకీయ పరిణామాల మధ్య సీఎం అయిన యడ్యూరప్ప ఈ సారి కూడా పూర్తికాలం సీఎంగా ఉండరనీ..రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆయన ఢిల్లీ వెళ్లటం..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పులు..ఆయన రాజీనామా వార్తలపై యడ్యూరప్ప స్పందించారు. రాజీనామా ఊహాగానాలను యడ్యూరప్ప ఖండించారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కర్ణాటకలో పార్టీ అభివృద్ధిపై చర్చించామనీ..తన పట్ల అధిష్టానానికి మంచి అభిప్రాయం ఉందని తాను అధిష్టానంతో భేటీ అయ్యింది కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి పలు కీలక విషయాలు చర్చించామని అంతేతప్ప తను రాజీనామా చేయటం అంతా కేవలం పుకార్లు మాత్రమేనంటూ క్లారిటీ ఇచ్చారు. కర్ణాటకలో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని యెడియూరప్ప ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కర్ణాటకలో సాగునీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకు మాత్రమే ఢిల్లీ వచ్చానని.. ఆగస్టులో మరోసారి ఢిల్లీకి వస్తానని ఆయన మీడియోకు వెల్లడించారు. మేకెదాటు ప్రాజెక్టుపై కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చించానని తెలిపారు. ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కూడా కలిసి చర్చించానని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టును సాధించి తీరుతామని యడ్యూరప్ప స్పష్టం చేశారు. దీంతో ఆయన రాజీనామా చేస్తారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది.
కాగా గతంలో యడ్యూరప్ప సీఎం అయినా పూర్తికాలం సీఎంగా కొనసాగకుండానే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నాలుగో సారి కూడా ఆయన పూర్తికాలంగా పదవిలో కొనసాగకుండానే రాజీనామా చేస్తారని..కర్ణాటకలో నాయకత్వాన్ని మార్చాలని బీజేపీ అధిష్టానం అనుకుంటోందని..అందుకే ఆయన ఢిల్లీ వెళ్లి కమలం పెద్దలను కలిసారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై యడ్యూరప్ప క్లారిటీ ఇవ్వటంతో ఇక ఆయన రాజీనామా పర్వానికి తెరపడినట్లు అయ్యింది. కాగా..గతంలో యెడియూరప్ప 2007 నవంబర్ 12 నుండి నవంబర్ 19 వరకు కేవలం ఆరు రోజులు మాత్రమే జేడిఎస్ మద్దతుతో సీఎంగా కొనసాగారు. అనంతరం ప్రభుత్వం పడిపోవడంతో గవర్నర్ పాలన విధించారు. ఆ తరువాత మే 30, 2008 నుండి జూలై 31 2011వరకు సీఎంగా కొనసాగారు.
We discussed in detail the development of the party in Karnataka. He has a very good opinion of me. I will work for the party to come back to power in the state again: Karnataka CM BS Yediyurappa on his meeting with BJP national president JP Nadda in Delhi pic.twitter.com/15NWRh2n6G
— ANI (@ANI) July 17, 2021