మొబైల్,టీవీ రాకముందు రేప్ లు జరగలేదు…మంత్రి విచిత్ర కామెంట్స్

  • Published By: venkaiahnaidu ,Published On : December 5, 2019 / 02:04 PM IST
మొబైల్,టీవీ రాకముందు రేప్ లు జరగలేదు…మంత్రి విచిత్ర కామెంట్స్

దేశంలో మహిళలపై అత్యాచారాలకు కారణం టీవీలు,మొబైల్ ఫోన్స్ మాత్రమేనని రాజస్థాన్ సాంఘీక సంక్షేమశాఖ మంత్రి భన్వర్ లాల్ మేఘవాల్ అన్నారు. టీవీలు,మొబైల్స్ రాకముందు రేప్ లు లేవని మంత్రి విచిత్ర కామెంట్స్ చేశారు.  ప్రస్తుతం యువతరం మొబైల్,టీవీ చూస్తూ తప్పుడు మార్గాలవైపు పయనిస్తున్నారని ఆయన అన్నారు. 

జైపూర్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)మేఘవాల్ మీడియాతో మాట్లాడుతూ…రేప్ కేసుల్లో మూడు నెలల్లోనే కోర్టులు తీర్పు ప్రకటించాలని,దోషులను బహిరంగంగా ఉరితీయాలన్నారు. హైదరాబాద్ లో దిశ అత్యాచార ఘటనపై దేశమంతా అట్టుడికిపోతున్న విషయం తెలిసిందే. అత్యాచారానికి పాల్పడినవారిని బహిరంగంగా ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు కాకుండా కఠిన చట్టాలను తీసుకొచ్చి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో టీవీలు,మొబైల్స్ మాత్రమే రేప్ లకు కారణమంటూ మంత్రి విచిత్రమైన కామెంట్స్ చేశారు.

2015లో అప్పటి బీహార్ మంత్రి బినయ్ బిహార్ కూడా రేప్ లు జరగడానికి నాన్ వెజ్ ఫుడ్,మొబైల్ ఫోన్స్ కారణమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో పలు రాష్ట్రాల మంత్రులు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలు కారణంగానే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని కామెంట్స్ చేశారు.