PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు

PM Modi: తన ఎనిమిదేళ్ల పదవీకాలంలో దేశ ప్రజలు సిగ్గుతో తలలు వంచుకునే విధంగా తాను ఎలాంటి పని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మే 26న ప్రధానిగా ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న మోడీ దేశానికి సేవ చేయడంలో తాను ఏ ప్రయత్నాన్నీ వదిలిపెట్టలేదని, మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశాన్ని నిర్మించడానికి నిజాయితీగా కృషి చేశానని అన్నారు. శనివారం గుజరాత్ లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజ్ కోట్ లో 200 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చేసిందన్నారు.
other stories: Indigo Airlines fined: ఇండిగో ఎయిర్లైన్స్కు రూ.5 లక్షలు జరిమానా విధించిన డీజీసీఏ
‘గత ఎనిమిదేళ్లలో దేశ సేవలో నిమగ్నమైన నేను చేయగలిగిందంతా చేశాను. మిమ్మల్ని గానీ, భారతదేశంలోని ఏ ఒక్క వ్యక్తిని గానీ సిగ్గుతో తల వంచుకునేలా ఏ పనీ నేను చేయలేదు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న భారతావనిని నిర్మించేందుకు గత ఎనిమిదేళ్లలో చిత్తశుద్ధితో కృషి చేశాం’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు సాధికారత కలిగిన భారతదేశాన్ని, పరిశుభ్రత, ఆరోగ్యం జీవితంలో భాగంగా ఉన్న భారతదేశాన్ని మహాత్మాగాంధీ కోరుకున్నారని, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ స్వదేశీ (స్థానిక) పరిష్కారాలపై ఆధారపడి ఉందని ప్రధాని అన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ మూడు కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించామని, బహిరంగ మలవిసర్జన రహిత కార్యక్రమం కింద 10 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించామని, తొమ్మిది కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు లభించాయని.. 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు లభించగా, ఆరు కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు లభించాయని, పీఎం-జేఏవై కింద 50 కోట్ల మందికి పైగా ఉచిత చికిత్స పొందేందుకు అవకాశం కల్పించినట్లు మోదీ వివరించారు.
other stories: AAP Rajya Sabha Nominees : పద్మశ్రీ గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు.. ఆప్ సర్కార్ మరో సంచలనం
ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదని, దేశంలోని పేదలకు గౌరవాన్ని అందించాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రజలు నిత్యావసరాలతో కొరతతో ఇబ్బంది పడకుండా..పేదల కోసం దేశంలోని ఆహార ధాన్యాల నిల్వలను తెరిచామని మోదీ చెప్పారు. పేదరికం గురించి మాట్లాడుతూ, పేదల దుస్థితిని తెలుసుకోవడానికి తాను పుస్తకాలు లేదా టెలివిజన్ ద్వారా నేర్చుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే తాను స్వయంగా అలాంటి దశను ఎదుర్కొన్నానని ప్రధాని మోడీ అన్నారు.
other stories: Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్నాథ్ కోవింద్
కేంద్రంలో, తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించారు. గుజరాత్ రాష్ట్రం వేగవంతమైన అభివృద్ధిని సాధించిందని, 2014 కు ముందు ఈ పరిస్థితి లేదని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కారణంగా గుజరాత్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను సాధిస్తోందన్నారు. 2014కు ముందు పరిస్థితులు భిన్నంగా ఉండేవని..మేము ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు ఫైళ్లను కేంద్రానికి (యుపిఎ ప్రభుత్వానికి) పంపితే, వారు తిరస్కరించేవారని, వారు ఏ అభివృద్ధి ప్రాజెక్టును చూడలేకపోయారని ఆయన అన్నారు.
- Minister AmitShah: 19ఏళ్లుగా మోదీ ఆ బాధను భరించాడు.. నేను దగ్గరగా చూశాను..
- Odisha Cabinet: ఒడిశాలో మొత్తం కేబినెట్ రాజీనామా: నేడు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
- Clashes in Kanpur: బీజేపీ మహిళా నేత వ్యాఖ్యలపై నిరసన: కాన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు
- Ants find Gold: చీమలు చెప్పిన బంగారు గని రహస్యం: బీహార్లో బంగారం ఎలా బయటపడింది
- Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్ను సంప్రదిస్తున్న అనేక దేశాలు
1Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
2Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం
3EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం
4Maharashtra: శివసేనకు ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్.. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపునకు గుర్తింపులేదు: ఎంపీ సావంత్
5JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
6Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
7Boris Johnson: రాజీనామా చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం
8Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
9Punjab: నిరాడంబరంగా జరిగిన సీఎం భగవంత్ మాన్ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజరు
10RC15: బ్యాక్ టు హైదరాబాద్!
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
-
The Ghost: కిల్లింగ్ మెషిన్గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?