అయ్యప్ప భక్తుల కోసం.. ఉక్కు బాటిళ్లలో మెడిసిన్ నీరు!
Sabarimala pilgrim:కరోనా మహమ్మారి కారణంగా సుధీర్ఘ అంతరాయం తర్వాత అప్రమత్తత మధ్యలో Travancore Devswom Board (TDB) అత్యున్నత ఆలయ సంస్థ, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా గణనీయ చర్యలు చేపట్టింది. ట్రెక్కింగ్ సమయంలో పంపిణీ చేసే మెడిసిన్ తాగునీరు ఇప్పుడు లార్డ్ అయ్యప్ప కోసం వచ్చే యాత్రికులకు సీసాలలో ఇవ్వబడుతుంది. కరోనా కారణంగా యాత్రికులను నివారించడానికి అలా చేయడానికి జెనరల్ బాడీ నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యవస్థ ప్రకారం ఈ తాగునీరు స్టీల్(ఉక్కు) సీసాలో యాత్రికులకు పంపిణీ చేయబోతున్నారు.
దీని కోసం యాత్రికులు రూ.200 చెల్లించాల్సి ఉంటుందని, పంబాలోని బేస్ క్యాంప్లో ఆంజనేయ ఆడిటోరియం దగ్గర మెడిసిన్ తాగునీరు పొందవచ్చని TDB అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం తిరిగి చెల్లిస్తారు కూడా. డిపాజిట్ చేసిన సొమ్మును బాటిల్ తిరిగి ఇచ్చేసిన తర్వాత చెల్లిస్తారు. స్టీల్ బాటిళ్లతో పాటు పేపర్ గ్లాసుల్లోనూ ఈ మెడిసిన్ నీటిని అందజేస్తారు.
https://10tv.in/nationwide-strike-against-labor-policies/
ట్రెక్కింగ్ మార్గంలో పంబా, చరలమేడు, జ్యోతినగర్, మాలికపురం వంటి వివిధ చోట్ల మళ్లీ వినియోగపరచలేని పేపర్ గ్లాసుల్లో ఈ నీటిని పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. మెడిసిన్ నీరు అంటే.. ఛుక్ (ఎండు అల్లం), రమాచామ్ (వెటివర్), పతి ముఖం (పతంగ కట్ట) వంటి ఆయుర్వేద మూలికలతో నీటిని వేడి చేసి తయారు చేస్తారు. యాత్రికులు ఎక్కువగా వచ్చే సమయాల్లో అయ్యప్ప భక్తులకు మెడిసిన్ నీటిని ఇస్తారు. పంపిణీ కేంద్రాల్లోనే ఈ నీటిని తయారు చేసి భక్తులకు అందజేస్తారు.