Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు

దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన ఓ 29ఏళ్ల యువకుడిలో బీఏ.5 వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 రకాల కేసులను ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలో గుర్తించగా...తాజాగా బీఏ.5 రెండో కేసు గుజరాత్‌లో వెలుగు చూసింది.

Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు

Omicron Ba.5

Omicron BA.5 : కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచదేశాలను పట్టిపీడిస్తూనేవుంది. డేల్టా, డేల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి కొత్త కొత్త వేరియట్స్ రూపంలో మానవాళిపై దాడి చేస్తూ ప్రాణాలు హరిస్తోంది. దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో కరోనా కేసులు ఉధృతి కావడానికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ బీఏ.4, బీఏ.5 కారణమయ్యాయి. దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. వైరస్‌ ఇంకా ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. ఒమిక్రాన్‌ వేరియంట్లతో కల్లోలం సృష్టిస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన బీఏ.5 రకం మరో కేసు నమోదైంది. గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ యువకుడిలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల వచ్చిన ఓ 29ఏళ్ల యువకుడిలో బీఏ.5 వేరియంట్‌ నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అధిక సాంక్రమిక సామర్థ్యం ఉన్నట్లు భావిస్తోన్న ఒమిక్రాన్‌ బీఏ.4, బీఏ.5 రకాల కేసులను ఇప్పటికే తమిళనాడు, తెలంగాణలో గుర్తించగా…తాజాగా బీఏ.5 రెండో కేసు గుజరాత్‌లో వెలుగు చూసింది. దక్షిణాఫ్రికాలో నివాసముంటున్న యువకుడు ఇటీవల వడోదరలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఈనెల 1న అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. ఒమిక్రాన్‌ బీఏ.5 పాజిటివ్‌గా తేలింది.

Omicron : ఎలుకల నుంచి మనుషులకు ఒమిక్రాన్ వ్యాప్తి?

ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్లు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం స్పష్టం చేసింది. తెలంగాణ, తమిళనాడులో ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తొలి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.4ను గుర్తించారు. ఇండియన్ సార్స్ కోవ్-2 కన్షార్షియం ఆన్ జీనోమిక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది.

BA.4 మొదటి కేసును గుర్తించాక, దక్షిణాఫ్రికా నుండి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తితో పరిచయం ఉన్న వారి కాంటాక్ట్ ట్రేసింగ్ ను ప్రారంభించామని అధికారులు చెబుతున్నారు. ఏ లక్షణాలు లేకపోయినా అతని నుంచి మే 9న సేకరించిన శాంపుల్స్‌లో విషయం బయటపడిందని న్యూస్ మీడియా పేర్కొంది. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మే 23న ఇదే కేసుపై బులెటిన్‌ను విడుదల చేసింది.

Omicron sub variants: ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో వ్యాక్సిన్ తీసుకున్నా ముప్పు తప్పదా?.. శాస్త్రవేత్తలు ఏమన్నారంటే?

తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో ఒమిక్రాన్‌ బీఏ.4ను గుర్తించామని ఇన్సాకాగ్‌ పేర్కొంది. ఆ బాధితురాలికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఆమె వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకొన్నట్లు తెలిపింది. తెలంగాణలో 80 ఏళ్ల వృద్ధుడిలో బీఏ.5 బయటపడినట్లు స్పష్టం చేసింది. అతడిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయని, పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ చేయించుకున్నట్లు పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువురు బాధితుల కాంట్రాక్ట్ ట్రేసింగ్‌ను చేపట్టినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.