Odisha Vaccination: ఒడిశా రికార్డు.. ఒక్క రోజులో 40లక్షల మందికి వ్యాక్సినేషన్

ఒడిశా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిపింది. సోమవారం ఒక్కరోజులోనే 40లక్షల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. గతంలో జూన్ 21న 33లక్షల 20వేల మందకి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు.

Odisha Vaccination: ఒడిశా రికార్డు.. ఒక్క రోజులో 40లక్షల మందికి వ్యాక్సినేషన్

Odisha

Odisha Vaccination: ఒడిశా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిపింది. సోమవారం ఒక్కరోజులోనే 40లక్షల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. గతంలో జూన్ 21న 33లక్షల 20వేల మందకి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం వెయ్యి 735సెంటర్లలో జరిగిన ఈ కార్యక్రమంలో సగం మంది 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్కులే ఉన్నారు.

సోమవారమే తొలి డోస్ వేసుకున్న వారి సంఖ్య పది లక్షలుగా నమోదై మరో మైలురాయిని దాటేసింది. ‘మా హెల్త్ టీంకు బోలెడ్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. ఒడిశా వాసులను వ్యాక్సిన్ అందిస్తూ సక్సెస్ ఫుల్ గా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు’ అని హెల్త్ డిపార్ట్‌మెంట్ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో 18ఏళ్ల పైబడ్డ వారు 30లక్షల మందికి పైగా ఉన్నారు.