శ్రీరాముడిలా ఉంటాడు కాబట్టే ప్రభాస్‌ను ఎంచుకున్నాం: ఓం రౌత్

శ్రీరాముడిలా ఉంటాడు కాబట్టే ప్రభాస్‌ను ఎంచుకున్నాం: ఓం రౌత్

ఫిల్మ్‌మేకర్ ఓం రౌత్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీయనున్న ఆదిపురుష్ కోసం వేగం పెంచారు. క్యారెక్టర్ తగ్గ వ్యక్తి ప్రభాసేనని ఎంచుకున్నారు కాబట్టే ప్రాజెక్టును రెడీ చేస్తున్నారట. టీ సిరీస్ భూషణ్ కుమార్ ప్రోత్సాహంతో టీం పలు భాషల్లో సినిమా తీసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గత వారమే ట్వీట్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదలచేశారు. ఆదిపురుష్.. “చెడుపై మంచి విజయం” అనే ట్యాగ్ లైన్ తో పోస్టర్ రిలీజ్ చేశారు.

బాహుబలి స్టార్ ప్రభాస్ ఈ రోల్ కు సరిపోతాడని ఎలా అనిపించాడని చెప్తే దానికి ఓం ఏం చెప్పారంటే.. ‘ప్రభాస్ జస్ట్ పర్‌ఫెక్ట్. అతని పర్సనాలిటీ వ్యక్తిత్వం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అతను అలా ఉన్నాడు కాబట్టే ఆదిపురుష్ కు తనను ఎంపిక చేశాం. లేదంటే అతని జోలికే వెళ్లేవాళ్లం కాదు’ అని చెప్పుకొచ్చారు.

డైరక్టర్ మాట్లాడుతూ.. రాముడి గురించి చెప్పడం, సినిమా విశేషాలు అప్పుడే చెప్పడం అంత సులువుకాదు. వెండితెరపై సినిమాను లైవ్ లో చూపించడానికి చాలా కష్టపడుతున్నాం. ఇది రాముడి కథ. చారిత్రక ఘట్టం. దీని కోసం చాలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. అదృష్టవశాత్తు దీనిపై ఆల్రెడీ రీసెర్చ్ జరుగుతుంది. చారిత్రక కోణంలో చూస్తే నోట్స్ రెడీగానే ఉన్నట్లు అయింది.

స్క్రీన్ మీద కథ చూపించాలంటే చాలా రీసెర్చ్ జరగాలి. టెక్నాలజీ, అప్పటి పరిస్థితులగురించి మరింత తెలుసుకోవాలి. చాలా స్టోరీ బోర్డుల చర్చ కూడా జరగాలి. అనుకున్నట్లుగా క్రియేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ రెడీ కావాలి’ అని డైరక్టర్ అన్నారు.

 

View this post on Instagram

 

Celebrating the victory of good over evil… Title Announcement #Adipurush @omraut @bhushankumar @vfxwaala @rajeshnair29 @tseriesfilms @retrophiles1 @tseries.official #TSeries

A post shared by Prabhas (@actorprabhas) on

ఓమ్స్ 2020 బ్లాక్ బ్లాస్టర్ తన్హాజీ (అజయ్ దేవ్‌గన్, సైఫ్ అలీఖాన్, కాజోల్ రేంజ్ సినిమా తీయాలనేదే ప్లాన్. తన్హాజీ కంటే ముందే ఆదిపురుష్ తీయాలనే ప్లాన్ డైరక్టర్ మైండ్ లో ఉందట. ”నిజానికి దీని గురించి కాస్త రీసెర్చ్ చేసి ఓ డ్రాఫ్ట్ రెడీ చేశా. మా టీంతో మాట్లాడా. దీనిని తెరకెక్కించడానికి వాళ్లు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలయ్యారు. ఈ రెండు నెలలు దీని రీ రైటింగ్ కోసం టైం తీసుకున్నాం. గతంలో రాసిన స్క్రీన్ ప్లేను అప్ డేట్ చేశాం. ఇది బాగా పనిచేస్తుందని నమ్ముతున్నాం.

జనవరి 2021 నాటికి సినిమా షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నాం. 2022 కల్లా రిలీజ్ చేస్తాం. ముందుగా అనుకున్న కథను ప్రభాస్ తో కలిసి చేస్తున్నామని తెలిశాక అతనికి అనుగుణంగా మార్చాల్సి వచ్చింది. అని డైరక్టర్ అన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో కీర్తి సురేశ్, సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా.. ఇంకా యాక్టర్లను ఫైనల్ చేయాలేదని ప్రొడ్యూసర్ అంటున్నారు.