Covid-19: ఆ రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఇప్పటికి 10 వేలకు పైనే నమోదవుతున్నాయి.

Covid-19: ఆ రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా మరణాలు

Covid 19 (7)

Covid-19: దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఇప్పటికి 10 వేలకు పైనే నమోదవుతున్నాయి. ఇక ఈ రాష్ట్రంలో కరోనా మరణాలు లక్ష దాటాయి. ఇప్పటివరకు కరోనాతో 1,00,130 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఈ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,31,781కు చేరింది. కొత్తగా 12,557 మంది కరోనా బారిన పడ్డారు.

ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 95.05 శాతం కాగా మరణాల రేటు 1.72 శాతంగా ఉంది. సోమవారానికి 1,85,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో అత్యధిక కరోనా టెస్టులు చేసిన రాష్ట్రం మహారాష్ట్రనే.. ఇక్కడ 3,65,08,967 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇక సోమవారం ప్రధాన నగరాలైన కొల్హాపూర్‌ డివిజన్‌లో 3,864, పుణే డివిజన్‌లో 2,999, ముంబై డివిజన్‌లో 2,420 కేసులు నమోదయ్యాయి.