COVID-19 : మళ్లీ పెరుగుతున్నాయ్..ఒక్కరోజే 54వేలకు పైగా కేసులు నమోదు

కరోనా కేసులు తగ్గుతున్నాయని..కాస్త ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న క్రమంలో మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో భారత్ లో నిన్న (జూన్ 23,2021)ఒక్కరోజే ఏకంగా 54,069 క‌రోనా కేసుల న‌మోదుయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

COVID-19 : మళ్లీ పెరుగుతున్నాయ్..ఒక్కరోజే 54వేలకు పైగా కేసులు నమోదు

Covid19 In India

COVID-19 in india : కరోనా కేసులు తగ్గుతున్నాయని..కాస్త ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న క్రమంలో మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో భారత్ దేశంలో నిన్న (జూన్ 23,2021)ఒక్కరోజే ఏకంగా 54,069 క‌రోనా కేసుల న‌మోదుయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778లకు చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1321 మంది ప్రాణాలు కోల్పోవటంతో మృతుల సంఖ్య మొత్తం 3,91,981కు పెరిగింది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా 68,885 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778కు చేరింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,90,63,740 మంది కోలుకున్నారు. 6,27,057 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో బాధితులకు చికిత్సలు కొనసాగుతున్నాయి. కరోనాను నియంత్రించటానికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో మొత్తం 30,16,26,028 వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా..భారత్ లో నిన్నటి వరకు మొత్తం 39,78,32,667 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,59,469 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.