NITI Aayog’s MPI : దేశంలో పేద రాష్ట్రాలు ఇవే..బీహార్ లో సగానికి పైగా జనాభా పేదరికంలోనే

బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్​ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్​ విడుదల చేసిన

NITI Aayog’s MPI : దేశంలో పేద రాష్ట్రాలు ఇవే..బీహార్ లో సగానికి పైగా జనాభా పేదరికంలోనే

Poverty

NITI Aayog’s MPI :  బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్​ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్​ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం…దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా బిహార్​ నిలవగా ఆ తర్వాత జార్ఘండ్​, ఉత్తర్​ప్రదేశ్​ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

2015-16లో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా తొలిసారి రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని విడుదల చేసింది నీతి ఆయోగ్​. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ఆక్స్​ఫర్డ్​ పావర్టీ, హ్యూమన్​ డెవలప్​మెంట్​ ఇనీషియేటివ్​(OPHI), ద యునైటెడ్​ నేషన్స్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రామ్​(UNDP) పద్ధతులను ఉపయోగించి భారత జాతీయ MPI(Multidimensional Poverty Index)ని రూపొందించినట్లు నీతి ఆయోగ్​ తెలిపింది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన విధానం వంటి మూడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. అందులో పోషకాహారం, పిల్లలు, పెద్దవారి మరణాలు, పాఠశాల హాజరు, వంట గ్యాస్​, పారిశుద్ధ్యం​, తాగునీరు, విద్యుత్తు, పక్కా ఇళ్లు, బ్యాంకు ఖాతాలు వంటి 12 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం..బిహార్​లో 51.91 శాతం(సగానికి పైగా జనాభా), జార్ఖండ్​లో 42.16శాతం, ఉత్తర్​ప్రదేశ్​లో 37.79 శాతం, మధ్యప్రదేశ్​లో 36.65, మేఘాలయలో 32.67శాతం మంది పేదరికంలోకి జారుకున్నారు. 13.74 శాతం మంది పేదవారితో సూచీలో 18వ స్థానంలో తెలంగాణ నిలవగా… 12.31 శాతం మందితో సూచీలో 20వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గోవాలో 3.76శాతం, సిక్కింలో 3.82శాతం, తమిళనాడులో 4.89శాతం, పంజాబ్​ లో 5.59శాతం మంది పేదరికంలోకి జారుకున్నారు. ఈ రిపోర్ట్ లో చివరిస్థానంలో కేరళ నిలిచింది. పేదవారు అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ(0.71 శాతం) సూచీలో చివరిస్థానంలో నిలిచింది.

ఇక,కేంద్రపాలిత ప్రాంతాల విషయానికొస్తే…దాద్రనగర్​ హవేలీ అత్యధికంగా 27.36 శాతంతో పేదరికంలో మొదటి ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​లో 12.58 శాతం, దామన్​ దియూలో 6.82 శాతం, ఛండీగఢ్​లో​ 5,97శాతం, ఢిల్లీలో 4.79శాతం, అండమాన్​ నికోబార్​ లో 4.30శాతం, లక్షద్వీప్​లో 1.82శాతం, పుదుచ్చేరిలో 1.72శాతం మంది పేదరికంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ రిపోర్ట్ పేర్కొంది.

ALSO READ International Flights : డిసెంబర్-15 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం