Adar Poonawalla: సొంత వాటాలు అమ్మేసుకున్న ఆదార్ పూనావాలా

పనాసియా బయోటెక్‌లో తన వాటా మొత్తాన్ని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా అమ్మేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్‌కు సంబంధించి పనాసియా బయోటెక్​ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Adar Poonawalla: సొంత వాటాలు అమ్మేసుకున్న ఆదార్ పూనావాలా

Adar Poonawalla (1)

Adar Poonawalla: పనాసియా బయోటెక్‌లో తన వాటా మొత్తాన్ని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా అమ్మేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్‌కు సంబంధించి పనాసియా బయోటెక్​ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఇప్పుడు ఈ కంపెనీలో 5.15 శాతం మేర ఉన్న సొంత వాటాను 118 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఈ వాటాను తాను సీఈఓగా వ్యవహరిస్తోన్న సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) దక్కించుకోవడం విశేషం.

బీఎస్‌ఈ బ్లాక్ డీల్ డేటా ప్రకారం, ఆదార్​ పూనావాలా 31లక్షల 57వేల 34 స్క్రిప్ట్‌లను ఒక్కో షేరుకు రూ .373.85 చొప్పున విక్రయించారు. మొత్తం డీల్ విలువ రూ .118.02 కోట్లుగా ఉండొచ్చని పీటీఐలో వచ్చింది.

బహిరంగ మార్కెట్​లో వేలం ద్వారా ఈ షేర్లను అదే ధర వద్ద సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఐఐ) దక్కించుకున్నట్లు పీటీఐ వెల్లడించింది. పనాసియా బయోటెక్​లో పూనావాలా 5.15 శాతం, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ) 4.98 శాతం వాటాకు యజమానులు.