Adar Poonawalla: సొంత వాటాలు అమ్మేసుకున్న ఆదార్ పూనావాలా
పనాసియా బయోటెక్లో తన వాటా మొత్తాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా అమ్మేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్కు సంబంధించి పనాసియా బయోటెక్ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Adar Poonawalla: పనాసియా బయోటెక్లో తన వాటా మొత్తాన్ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా అమ్మేసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్కు సంబంధించి పనాసియా బయోటెక్ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇప్పుడు ఈ కంపెనీలో 5.15 శాతం మేర ఉన్న సొంత వాటాను 118 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఈ వాటాను తాను సీఈఓగా వ్యవహరిస్తోన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) దక్కించుకోవడం విశేషం.
బీఎస్ఈ బ్లాక్ డీల్ డేటా ప్రకారం, ఆదార్ పూనావాలా 31లక్షల 57వేల 34 స్క్రిప్ట్లను ఒక్కో షేరుకు రూ .373.85 చొప్పున విక్రయించారు. మొత్తం డీల్ విలువ రూ .118.02 కోట్లుగా ఉండొచ్చని పీటీఐలో వచ్చింది.
బహిరంగ మార్కెట్లో వేలం ద్వారా ఈ షేర్లను అదే ధర వద్ద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) దక్కించుకున్నట్లు పీటీఐ వెల్లడించింది. పనాసియా బయోటెక్లో పూనావాలా 5.15 శాతం, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) 4.98 శాతం వాటాకు యజమానులు.