Chennai Hospital: హాస్పిటల్‌లో సెల్‌ఫోన్ కోసం కొవిడ్ రోగిని హత్య

సెల్ ఫోన్ కోసం కొవిడ్ రోగినే హత్య చేసింది హాస్పిటల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ రతీదేవి. హాస్పిటల్ లో చేరిన తన భార్య కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Chennai Hospital: హాస్పిటల్‌లో సెల్‌ఫోన్ కోసం కొవిడ్ రోగిని హత్య

Dead Body

Chennai Hospital: సెల్ ఫోన్ కోసం కొవిడ్ రోగినే హత్య చేసింది హాస్పిటల్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ రతీదేవి. హాస్పిటల్ లో చేరిన తన భార్య కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మే 23న జరిగిన ఈ ఘటన.. బుధవారం హాస్పిటల్ వెనుక డెడ్ బాడీ దొరకడంతో ముగిసింది.

ప్రాథమిక విచారణ చేపట్టి నిందితురాలు రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. సునీతను ప్లాన్ చేసి టార్గెట్ చేసిందని.. ఆరోగ్యం క్షీణించాక, ఆమెతో పాటు ఎవరూ లేని సమయం కోసం ఎదురుచూసి ఘోరానికి పాల్పడింది.

స్కానింగ్ చేయాలని సునీతను తీసుకెళ్లి వీల్ ఛైర్ లో కూర్చోబెట్టుకుని సర్వీస్ లిఫ్ట్ ఎక్కింది. ఎనిమిదో ఫ్లోర్ చేరుకున్న తర్వాత.. చిన్న పాటి ట్యూబ్ సాయంతో మహిళను చంపేసింది.

ఆ తర్వాత మూడో ఫ్లోర్ చేరుకుని రూ.9వేల 500నగదును ఆమెకు సంబంధించిన వస్తువులను కాజేసింది. కొవిడ్ రోగి అయిన సునీత నుంచి నగదు, సెల్ ఫోన్ కాజేసేందుకే హత్య చేసినట్లుగా విచారణలో రతీదేవీ అంగీకరించింది.