Peasant Movement : ఢిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘంగా సాగుతోన్న రైతు ఉద్యమం
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 300 రోజులుగా రైతు ఉద్యమం కొనసాగుతోంది.
Peasant movement in Delhi : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం సుదీర్ఘంగా సాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 300 రోజులుగా రైతు ఉద్యమం కొనసాగుతోంది. దేశంలోని లక్షలాది మంది రైతుల సంకల్పానికి సాక్ష్యంగా రైతు ఉద్యమం నిలిచిందని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. రానున్న రోజుల్లో రైతు ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది.
దేశ వ్యవసాయ రంగాన్ని హస్తగతం చేసుకోవడానికి చూస్తున్న కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా.. రైతులు శాంతియుతంగా పోరాడుతున్నారు. రైతుల డిమాండ్లు ఏంటో మోడీ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు అంటున్నారు. |దేశంలో అధిక సంఖ్యలో ఉన్న రైతులు వేసిన ఓట్ల ద్వారా గెలిచిన ప్రభుత్వం.. వాటిని అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఆందోళనలను మరింత విస్తృతం చేస్తామని చెప్పారు.
NHRC : రైతుల ఆందోళన..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సెప్టెంబర్ 27న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త బంద్కు ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్నారు. రైతులు తలపెట్టిన భారత్ బంద్లో కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొంటాయని తెలిపారు. బంద్లో భాగంగా సైకిల్, బైక్ ర్యాలీలు కిసాన్ మహా పంచాయత్లు నిర్వహిస్తామని చెప్పారు.