Thieves : రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. అర్ధరాత్రి ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి

బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు ఇవ్వాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు.

Thieves : రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. అర్ధరాత్రి ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి

Thieves

Thieves : బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగివస్తున్న వారిపై దొంగలు దాడిచేశారు. వారివద్ద ఉన్న వస్తువులు ఇవ్వాలంటూ విచక్షణ రహితంగా కొట్టారు. రాళ్ళూ, బండలు, కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పంకజ్, జతిన్‌‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన డిసెంబర్ 20వ తేదీ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. దాడికి సంబందించిన దృశ్యాలు సమీపంలోని సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.

చదవండి : Inter state thieves: కడప జిల్లాలో అంతర్రాష్ట్ర ముఠా

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంకజ్, జతిన్‌ ఇద్దరు దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఇదే సమయంలో వారిని అడ్డగించిన ఏడుగురు సభ్యుల గ్యాంగ్.. వారి వద్ద ఉన్న డబ్బు ఇవ్వాలని బెదిరించింది. వారు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు జతిన్ పాకెట్ లో ఉన్న రూ.3,000 లాక్కున్నారు. కత్తులు, పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు. ఇద్దరినీ పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువలో పడేశారు.

చదవండి : Delhi Temperature: ఢిల్లీలో అత్యల్పంగా 4డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు

విజయం తెలుసుకున్న జతిన్ సోదరుడు.. గాయపడిన ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్లాడు. ఉదయం ఇద్దరినీ తీసుకోని ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళాడు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ పంకజ్ మృతి చెందగా, జతిన్ కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇక సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు, ప్రధాన నిందితుడు రంజాన్ అలీని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.