అసోంలో కాంగ్రెస్ కూటమికి రెడ్ కార్డ్ : మోడీ

అసోంలో మరోసారి బీజేపీదే అధికారం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.

అసోంలో కాంగ్రెస్ కూటమికి రెడ్ కార్డ్ : మోడీ

People Of Assam Have Shown Red Card To Congress Alliance Says Pm Modi

People of Assam అసోంలో మరోసారి బీజేపీదే అధికారం అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గురువారం కోక్రాజర్​లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ…కాంగ్రెస్​ నేతృత్వంలోని మహాజోత్ ​కూటమికి అసోంలో ప్రజలు రెడ్​ కార్డ్​ చూపించారని అన్నారు. అభివృద్ధి, శాంతి, సుస్థిరత కోసం ప్రజలు ఎన్డీఏకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

మోడీ మాట్లాడుతూ..తొలి దశ పోలింగ్​లో అసోం ప్రజలు ఎన్డీఏను ఆశీర్వదించారు. అసోం యువత ఫుట్​బాల్​ బాగా ఆడతారు. వారి భాషలో చెప్పాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్​​ కూటమికి ప్రజలు రెడ్​ కార్డ్​ చూపించారు. అసోం సంక్షేమం కోసం సబ్​కా సాత్, సబ్​కా వికాస్, సబ్​కా విశ్వాస్ అనే మంత్రంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. మా ఘన విజయంపై ప్రజలు ఆమోదముద్ర వేశారు. అభివృద్ధి, శాంతి భద్రతల కోసం ఎన్డీఏను ప్రజలు విశ్వసిస్తున్నారని మోడీ అన్నారు.

బోడో ప్రభావిత ప్రాంతాల్లో హింసను అరికట్టడానికి కేంద్రంలో, రాష్ట్రంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్​ ఏమీ చేయలేదని ప్రధాని విమర్శించారు. బోడో ప్రభావిత ప్రాంతాల్లో అంతులేని హింస పట్ల కాంగ్రెస్ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ సుదీర్ఘ కాలం పాలనలో బోడోల్యాండ్​..బాంబులు, తుపాకులు, దిగ్బంధన సంస్కృతిగా మారిందని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతానికి ఎన్డీఏ.. శాంతి, గౌరవాన్ని బహూకరించిందన్నారు.

తాళం, తాళం చెవికి (కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీ AIUDF గుర్తు) కాంగ్రెస్ లొంగిపోయిందని మోడీ విమర్శించారు. దానికి వారు తగిన శిక్ష అనుభవిస్తారని అన్నారు. కష్టపడి సాధించుకున్న శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కొల్లగొట్టనీయబోమని మోడీ అన్నారు. అసోంలో తీవ్ర సమస్యగా ఉన్న అక్రమ వలసలను ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్​ ప్రోత్సాహిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్​షా సహా బీజేపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

కాగా,126స్థానాలున్న అసోం అసెంబ్లీకి గురువారం రెండో దశలో భాగంగా 39 స్థానాలకు పోలింగ్ జరిగింది. మార్చి-27న మొదటి దశలో 47స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక,ఏప్రిల్-6న మూడో దశ(చివరి దశ)లో భాగంగా మిగిలిన 40స్థానాలకు పోలింగ్ జరగనుంది.