ICMR : కరోనా దృష్ట్యా పండుగ‌ల సీజన్ లో ప్రజలు జాగ్ర‌త్త‌గా ఉండాలి : ఐసీఎంఆర్

కరోనా మహమ్మారి దృష్ట్యా పండుగ‌ల సీజన్ లో దేశ ప్రజలు జాగ్ర‌త్త‌గా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.

ICMR : కరోనా దృష్ట్యా పండుగ‌ల సీజన్ లో ప్రజలు జాగ్ర‌త్త‌గా ఉండాలి : ఐసీఎంఆర్

Icmr

ICMR warning : కరోనా మహమ్మారి దృష్ట్యా పండుగ‌ల సీజన్ లో దేశ ప్రజలు జాగ్ర‌త్త‌గా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు ధరించాలని సూచించింది. కేర‌ళ‌లో క‌రోనా ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతున్న‌ట్లు ఐసీఎంఆర్ డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల్‌రామ్ భార్గ‌వ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇత‌ర రాష్ట్రాల్లోనూ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు చెప్పారు.

అయితే పండుగ‌ల సీజ‌న్ ఉన్నందున ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో గుమికూడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దాంతో మ‌ళ్లీ వైర‌స్ ప్ర‌బ‌లే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. అంద‌రూ వ్యాక్సిన్లు తీసుకోవాల‌ని, కరోనా ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటించాల‌ని సూచించారు. బాధ్య‌తాయుతంగా ప్ర‌యాణించాల‌ని, పండుగ‌ల‌ను కూడా బాధ‌త్య‌తో జరుపుకోవాల‌ని బ‌ల్‌రామ్ భార్గ‌వ్ పేర్కొన్నారు.

ICMR Vaccine Mixing : కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి వేసుకోవచ్చు..ఐసీఎంఆర్ కీలక ప్రకటన

దేశ‌ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో కేర‌ళ‌లోనే 68 శాతం ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ తెలిపారు. కేర‌ళ‌లో మొత్తం 1.99 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని చెప్పారు. మిజోరం, ఏపీ, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌లో 10 వేల యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు వెల్లడించారు. 11 వారాల నుంచి పాజిటివిటీ రేటు 3 శాతం క‌న్నా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు రాజేశ్ తెలిపారు.

దేశంలోని 64 జిల్లాల్లో మాత్రం కోవిడ్ పాజిటివిటీ 5 శాతానికి ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొన్నారు. దేశ‌ వ్యాప్తంగా 3,631 పీఎస్ఏ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేశామ‌ని వెల్లడించారు. ఈ ప్లాంట్లు క‌మిష‌న్ అయిన త‌ర్వాత సుమారు 4500 మెట్రిక్ ట‌న్నుల మెడిక‌ల్ ఆక్సిజ‌న్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలిపారు.