భారతదేశానికి పేదరికం ఉందని చెప్పలేని సాక్ష్యం

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2019 / 01:52 PM IST
భారతదేశానికి పేదరికం ఉందని చెప్పలేని సాక్ష్యం

శుక్రవారం(అక్టోబర్-11,2019)ప్రముఖ వ్యాపారవేత్త,మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మట్టిలో క్యారంబోర్డు చేసుకుని,క్యారంబోర్డుకి ఉన్నట్లే నాలుగువైపులా హోల్స్ పెట్టి బాటిల్స్ మూతలతో ఆడుతున్న చిన్నారుల ఫోటోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. భారతదేశానికి పేదరికం ఉందని చెప్పలేని సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు.   

ఈ ఫొటోను చూస మా చిన్ననాటి జ్ణాపకాలు గుర్తుకొచ్చాయి…ఆ రోజులే వేరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు తమ బాల్యాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇన్స్పైరింగ్ ఫొటో షేర్ చేశారు సార్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆనంద్ మహీంద్రా ఈ ఫోటో షేర్ చేసిన కొద్ది సేపటికే వేల సంఖ్యలో లైక్ లు,కామెంట్లు వచ్చాయి.