Platform ticket price: రూ.5 నుంచి రూ.50కు పెరిగిన ప్లాట్ఫాం టిక్కెట్ ధర
రద్దీని నియంత్రించేందుకు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారం చార్జీలు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కనీస టికెట్ ఛార్జీ రూ.5 ఉండగా..
Platform ticket price: రద్దీని నియంత్రించేందుకు రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫారం చార్జీలు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కనీస టికెట్ ఛార్జీ రూ.5 ఉండగా కేవలం ప్లాట్ఫాం టికెట్కు రూ.50 ఎలా వసూలు చేస్తున్నారంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. రూ.5 చెల్లించి లోకల్ రైలు టికెట్ తీసుకుని ప్లాట్ఫారంపై వెళ్లడం గిట్టుబాటవుతున్నట్లుగా కొందరు భావిస్తున్నారని అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అలోచించాలని రైల్వే అధికారులకు సూచించారు.
మార్చి నుంచే అమలు..
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రద్దీగా ఉండే ప్రముఖ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ), దాదర్ టర్మినస్, కుర్లా టెర్మినస్, బాంద్రా టర్మినస్, ముంబై సెంట్రల్ తదితర ప్రధాన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్లాట్ఫారంల చార్జీలు ఐదు రేట్లు పెంచింది. మొన్నటి వరకు రూ.10 ఉన్న ప్లాట్ఫాం చార్జీలను మార్చి ఒకటో తేదీ నుంచి ఏకంగా రూ.50 పెంచారు.
రద్దీని నియంత్రించడానికి ప్రత్నామ్యాయ మార్గాలను అన్వేషించాలని సూచించింది. స్వగ్రామాలకు, పర్యటనకు, పుణ్య క్షేత్రాలకు బయలుదేరే తమ బంధువులను సాగనంపేందుకు స్టేషన్కు వచ్చే వారి నుంచి ఇలా భారీగా ప్లాట్ఫారం చార్జీల వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని సంఘటన ప్రశ్నించింది. త్వరలో వేసవి సెలవులు, శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.
రైల్వేస్టేషన్స్లో ప్రయాణికులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారని, జనాల రద్ధీని తగ్గించేందుకు రైల్వే ప్లాట్ఫారం టికెట్ ధరలు పెంచేసి యాభై రూపాయలు చేసింది. ఈ పెంచిన ధరలు జూన్ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌరసంబంధాల అధికారి గతంలోనే వెల్లడించారు. రద్దీని తగ్గించేందుకే రేట్లను పెంచామని స్పష్టం చేశారు.