బీహార్ లో పీఎం కేర్స్ ఫండ్ 500 పడకలతో కోవిడ్ ఆసుపత్రులు

  • Published By: madhu ,Published On : August 24, 2020 / 01:24 PM IST
బీహార్ లో పీఎం కేర్స్ ఫండ్ 500 పడకలతో కోవిడ్ ఆసుపత్రులు

పీఎం కేర్స్ ఫండ్ తో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. బీహార్ రాష్ట్రంలో 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రంలోని పాట్నా, ముజఫర్ నగరాల్లో 500 పడకలతో కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.



బీహార్ రాష్ట్రంలోని డీఆర్డీవో ఆధ్వర్యంలో రెండు కోవిడ్ -19 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇక ఆసుపత్రిలో వెంటిలేటర్లతో 125 ఐసీయూ పడకలు, 375 సాధారణ పడకలు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సరఫరా చేస్తామని తెలిపింది.



ప్రత్యేక ఈ ఆసుపత్రుల్లో సైనిక దళాల వైద్య సర్వీసులకు చెందిన వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది పని చేస్తారన్నారు. త్వరలోనే రెండు ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామంది.