బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేస్తేనే డబ్బులు : కొత్త రూల్

కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్‌ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్‌ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్‌ అనుసంధానమైన బ్యాంకు

  • Published By: veegamteam ,Published On : December 11, 2019 / 02:46 AM IST
బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేస్తేనే డబ్బులు : కొత్త రూల్

కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్‌ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్‌ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్‌ అనుసంధానమైన బ్యాంకు

కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్‌ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్‌ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్‌ అనుసంధానమైన బ్యాంకు ఖాతాలుంటేనే నగదును బదిలీ చేస్తారు. ఈ మేరకు వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మంగళవారం(డిసెంబర్ 10,2019) లోక్‌సభలో ప్రకటించారు. ఈ నిబంధన డిసెంబర్ 2019 నుంచే అమలవుతుందన్నారు. దేశవ్యాప్తంగా పీఎం-కిసాన్‌ పథకం కింద 14 కోట్ల మంది రైతులకు రూ.6 వేల చొప్పున ఇస్తున్నారు. 

అన్నదాతకు ఆర్థికంగా చేయూత అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌ను లాంచ్ చేసింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు అందిస్తుంది. ఈ రూ.6వేలు ఒకేసారి కాకుండా విడతల (3 దశల్లో రూ.2వేలు చొప్పున) వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. డిసెంబర్ నెల కూడా రైతుల అకౌంట్లలోకి రూ.2వేలు పడాల్సి ఉంది. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే పరిస్థితి లేదు. బ్యాంకు ఖాతాను ఆధార్ తో లింక్ చేసిన వారికి మాత్రమే డబ్బు అందుతుంది.

2019 ఫిబ్రవరి 24 న ఉత్తరప్రదేశ్ లోని గోరక్ పూర్ లో ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదటగా కోటి మంది రైతులకు రూ.2వేల నగదు బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఈ పథకానికి ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు విధించలేదు. నాలుగో విడత సాయం చెల్లించే సమయంలో మాత్రం బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరి అనే అంశాన్ని తీసుకొచ్చింది. సో.. అర్హులైన రైతులు తమ బ్యాంక్ అకౌంట్ ను వెంటనే ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేసుకోండి. లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్‌లోకి రావని అధికారులు చెప్పారు.

కాగా, ఆధార్‌ లేదన్న కారణంతో రేషన్‌ కార్డుల డేటాబేస్‌ నుంచి లబ్ధిదారుల పేర్లు తొలగించొద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించినట్లు ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్ లోక్‌సభలో తెలిపారు. ఆధార్‌ లేదన్న సాకుతో ఆహార ధాన్యాలను నిరాకరించడం లేదా కార్డుదారుల పేర్లను తొలగించడం చేయొద్దని ఆదేశించామన్నారు.