హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 09:19 AM IST
హామీ ఇస్తున్నా : దేశం సురక్షితమైన చేతుల్లో ఉంది

దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019)  ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలు మెరుపు దాడి చేసి దాదాపు 300మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!

దీనిపై మొదటిసారిగా మంగళవారం రాజస్థాన్ లోని  చురూలో నిర్వహించిన బహిరంగసభలో స్పందించిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని తాను హామీ ఇస్తున్నానన్నారు.

2014లో చెప్పిందే తాను ఇప్పుడు మళ్లీ చెబుతున్నానని..దేశ ప్రతిష్ఠతను మట్టిలో కలవనివ్వనని అన్నారు. మన శౌర్యం ఇక్కడితో ఆగిపోదన్నారు. మన దేశాన్ని ఎవ్వరి ముందు తల వంచుకునే పరిస్థితి రానివ్వనన్నారు.  పాక్ ముందు భారత్ ఎప్పటికీ తల వంచదని భారతమాతకు తాను మాట ఇస్తున్నానని అన్నారు.

Also Read :1971 తర్వాత ఇదే : పాక్ లోకి వెళ్లి మరీ.. భారత్ దాడి చేసింది
Also Read : అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు