India – Nepal: భారత్ నేపాల్ మధ్య దృఢమైన బంధం: రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

భారతదేశం మరియు నేపాల్ మధ్య మొట్టమొదటి ప్యాసింజర్ రైలు లింక్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శనివారం ప్రారంభించారు.

India – Nepal: భారత్ నేపాల్ మధ్య దృఢమైన బంధం: రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Nepal India

India – Nepal: భారతదేశం మరియు నేపాల్ మధ్య మొట్టమొదటి ప్యాసింజర్ రైలు లింక్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శనివారం ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చిన నేపాల్ ప్రధాని బహదూర్ శనివారం న్యూఢిల్లీలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రైల్వేలు, ఇంధనం వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంపొందించేవిధంగా నాలుగు ఒప్పందాలను ఖరారు చేశారు. నేపాల్ అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో చేరడం, రైల్వే సెక్టార్ లో సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడం, ఇండియన్ ఆయిల్ నేపాల్ ఆయిల్ మధ్య పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాపై ఒప్పందం మరియు సాంకేతిక నైపుణ్యాన్ని పంచుకోవడం అనే అంశాలపై ఒప్పందాలు జరిగాయి.

Also read:Congress Party: ఢిల్లీలో బంగ్లా ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నోటీసులు

ఈ సందర్భంగా ఉభయ దేశాధినేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ “వాణిజ్యంతో పాటు అన్ని అంశాలలో రెండు దేశాల మధ్య అనుసంధాన కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వ డానికి మేము అంగీక రిస్తున్నాం. అందులో భాగంగానే రైల్వే లైన్ పునరుద్ధరణకు చొరవ తీసుకున్నాం” అని అన్నారు. నేపాల్ అభివృద్ధి, శాంతి, సంవృద్ధిలో భారతదేశ మద్దతు తప్పకుండా ఉంటుందని మోదీ వివరించారు. సరిహద్దు వివాదం, విద్యుత్, కనెక్టివిటీ, ప్రజల మధ్య సంబంధాలు, ఆరోగ్య రంగం, ఇంధనం, వాణిజ్య సహకారం, అభివృద్ధి, ఆర్థిక భాగస్వామ్యం వంటి అనేక ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాలు దృష్టిసారించారు.

Also read:Arvind Kejriwal: అవినీతిలేకుండా చేస్తా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి: గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్

కాగా 2021 జూలైలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేపాల్ ప్రధాని భారత పర్యటనకు రావడం ఇది ఐదోసారి. ఇరువురు నాయకులు చర్చల సందర్భంగా కాలాపానీ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. చర్చల ముగింపు సందర్భంగా ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు సమస్యపై చర్చించామని, ద్వైపాక్షిక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ భూభాగంలోని కాలాపానీ-లిపులేఖ్-లింపియాడోరా ప్రాంతాలను భారతదేశ చిత్రపటంలో చూపించడంపై 2019 నవంబర్లో కాలాపానీ సరిహద్దు సమస్య తలెత్తింది.

Also read:AP New Districts : ఏపీలో మొత్తం జిల్లాలు 26, రెవెన్యూ డివిజన్లు 73, పూర్తి వివరాలు

భారతదేశం యొక్క సవరించిన రాజకీయ మ్యాప్ ఉత్తరాఖండ్ భూభాగంలోని కాలాపానీ-లిపులేఖ్-లింపియాడోరా యొక్క త్రిభుజాకార ప్రాంతాన్ని చిత్రీకరించిన తరువాత 2019 నవంబర్లో కాలాపానీ సరిహద్దు సమస్య తలెత్తింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ సవరించిన పటాన్ని తమ భూభాగంగా పేర్కొంటూ నేపాల్ తన జాతీయ చిహ్నంలో సూచించింది. ఈవ్యవహారంపై ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని “ఫైనాన్సియల్ ఎక్స్ప్రెస్” నివేదించింది.

Also read:Arunachal Pradesh : ఇద్దరు పౌరులపై పొరపాటున ఆర్మీ కాల్పులు..