పాత కథల్లో ఉండే అహంకార రాజులాంటివాడే మోడీ

పాత కథల్లో ఉండే అహంకార రాజులాంటివాడే మోడీ

PRIYANKA GANDHI ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్​ నాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో కిసాన్ మహాపంచాయత్​ కార్యక్రమానికి శనివారం హాజరైన ప్రియాంక గాంధీ…పాత కథల్లో ఉండే అహంకార రాజు పాత్ర వంటి వ్యక్తి.. మోడీ అని ఎద్దేవా చేశారు.

దేశాన్ని కాపాడే సైనికుడు కూడా ఒక రైతు బిడ్డేనని మోడీ అర్థం చేసుకోలేకపోతున్నారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు ఎంతగా నిరసిస్తున్నా.. వారి బాధలను ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. మోడీ రాజకీయాలన్నీ తాను, తన బిలియనీర్ పెట్టుబడిదారుల​ మిత్రుల కోసమేనన్నారు. దేశాన్ని మోడీ ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు ఎలా అమ్మేశారో.. అదే విధంగా మిమ్మల్ని, మీ భూములను, మీ ఆదాయాలను అమ్మేస్తారు అని రైతులని ఉద్దేశించి ప్రియాంక మాట్లాడారు.

.ఢిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతుల ప్రదేశం..ప్రధాని నివాసానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయన విదేశాలకు వెళ్లగలరు. కానీ, ఎందుకని లక్షలాది మంది అన్నదాతల వద్దకు వెళ్లలేకపోతున్నారు. వారి బాధలను ఎందుకు వినిపించుకోవట్లేదు అని ప్రియాంక ప్రశ్నించారు.