PM Modi: ఆంధ్రాలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై నాల్గో తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కేవలం 2–3 గంటల పాటు గడిపి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు.
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై నాల్గో తేదీన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కేవలం 2–3 గంటల పాటు గడిపి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాటు చేసే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా.. స్వాతంత్య్ర పోరాట విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగే కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమమని, రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతోనూ ప్రధాని ఎయిర్పోర్టులోనే కొద్దిసేపు ముచ్చటించే అవకాశమే ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ప్రధాని పర్యటనకు సంబంధించి మినిట్–టు–మినిట్ కార్యక్రమ వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.
Read Also: ప్రధానిగా మోదీ ఉండకూడదు.. వారిద్దరిలో ఎవరైనా ఓకే..
ఇప్పటికి ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న మోదీ.. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 – 10.40 గంటల మధ్య గన్నవరం ఎయిర్పోర్టుకు రానున్నట్లు తెలుస్తోంది.