PM Modi’s Flight : రూటు మార్చిన మోదీ ఫ్లైట్..పాక్ గగనతలం మీదుగా
క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

PM Modi’s Flight క్వాడ్ శిఖరాగ్ర సదస్సు, ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం సహా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లతో ద్వైపాక్షిక చర్చల కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం మూడు రోజుల పర్యటన కోసం భారత వీవీఐపీ విమానమైన “ఎయిర్ఇండియా వన్” లో అమెరికా బయల్దేరిన విషయం తెలిసిందే. అయితే మోదీ ప్రయాణిస్తున్న విమానం అప్ఘానిస్తాన్ మీదుగా కాకుండా పాకిస్తాన్ గగనతలంపై నుంచి వెళ్లింది. సాధారణంగా అప్ఘానిస్తాన్ నుంచి వెళ్లాల్సిన విమానాన్ని.. భద్రత కారణాల దృష్ట్యా పాక్ మీదుగా తీసుకెళ్లారు అధికారులు. మోదీ ప్రయాణం కోసం తన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది.
అఫ్గాన్లో భద్రతా పరిస్థితులు ఆందోళకరంగా ఉన్న నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవద్దని భారత నిఘా వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటన కోసం మోదీ విమానానికి అనుమతి ఇవ్వాలని భారత్.. పాక్ను కోరింది. భారత్ చేసిన అభ్యర్థనకు పాకిస్తాన్ సానుకూలంగా స్పందించి అనుమతిచ్చిందని అధికారులు తెలిపారు. అప్ఘాన్ గగనతలం నుంచి కాకుండా పాకిస్తాన్పై నుంచి వెళ్తుండటం వల్ల ప్రయాణ సమయం గంట అధికమవుతుందని తెలిపారు.
కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్పై గుర్రుగా ఉన్న పాకిస్తాన్ తన గగనతలాన్ని ఉపయోగించుకోకుండా చేస్తోంది. గతంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఐస్లాండ్ పర్యటన సహా మోదీ అమెరికా, జర్మనీ పర్యటనల కోసం భారత అధికారులు అనుమతులు కోరగా.. ఈ మూడుసార్లూ అనుమతులు తిరస్కరించింది పాకిస్తాన్. దీనిపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ వద్ద భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయితే, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్రీలంక పర్యటన కోసం మన గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు భారత్ అనుమతించడం గమనార్హం.
READ ప్రధాని మోదీ అమెరికా టూర్ షెడ్యూల్
- Minister Kishan Reddy: బీజేపీ కార్యవర్గ సమావేశాలకు టీఆర్ఎస్ ఆటంకాలు కలిగిస్తుంది
- PM Modi: 3న బీజేపీ బహిరంగ సభ.. మోదీ ఉండే స్టేజీపై ఏడుగురికే అనుమతి
- PM Modi : భీమవరంలో భారత్ లోనే భారీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ
- PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ
- Andra pradesh : ప్రధాని పాల్గొనే అల్లూరి జయంతి వేడుకలకు రావాలని చంద్రబాబుకు మంత్రి కిషన్రెడ్డి లేఖ
1Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
2Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
3Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
4Godfather: గాడ్ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
5Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
6presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
7Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
8Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
9The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
10DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్తో రిలేషన్పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!
-
Boyfriend Attempted Suicide : ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ఫంక్షన్ హాల్ వద్దే కిరోసిన్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం