PM Narendar Modi: నేడు హిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన.. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం.. పర్యటన ఇలా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. మోదీ పది రోజుల వ్యవధిలో హిమాచల్ ప్రదేశ్లో రెండవసారి పర్యటించనున్నారు .
PM Narendar Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం వివరాల ప్రకారం.. నరేంద్ర మోదీ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఉనా హిమాచల్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకు ఈ కొత్త ఎక్స్ప్రెస్ పరుగులు పెట్టనుంది. దేశంలో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లలో ఇది నాలుగవది.
PM Modi: యుక్రెయిన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్.. రష్యాతో శాంతి కోసం సాయం చేస్తామని హామీ
ప్రధాని పర్యటనలో భాగంగా.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఉనాను జాతికి అంకితం చేయనున్నారు. 2017లో ప్రధానమంత్రి దీనికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉనాలో బల్క్ డ్రగ్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు, ఆ తర్వాత చంబాలో జరిగే బహిరంగ కార్యక్రమంలో రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హిమాచల్ ప్రదేశ్లో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY)-IIIని మోదీ ప్రారంభిస్తారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం 9గంటలకు హెలికాప్టర్ ద్వారా ఉనా పోలీస్ లైన్ ఝలెదా వద్దకు వెళ్తారు. 9.15గంటలకు ఉనా రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఉదయం 9:45 గంటలకు ఉనాలోని ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ బల్క్ డ్రగ్ పార్క్, హరోలి, ఉనా-హమీర్పూర్ కొత్త రైల్వే లైన్కు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:50 గంటలకు ఝలేదా నుంచి చంబాకు బయలుదేరుతారు. ఉదయం 11:45 గంటలకు చంబాలోని సుల్తాన్పూర్ హెలిప్యాడ్ నుంచి చౌగన్ మైదాన్కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు చౌగన్లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇక్కడ జరిగే బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1:05 గంట తరువాత పఠాన్కోట్ మీదుగా మోదీ ఢిల్లీకి చేరుకుంటారు.