PM Modi: అమెరికా వెళ్లి జోబైడెన్ ను కలవనున్న పీఎం మోదీ
పీఎం మోదీ అమెరికా పర్యటన సెప్టెంబర్ నెలాఖారులో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాషింగ్టన్, న్యూయార్క్ లకు వెళ్లి అమెరికా ప్రెసిడెంట్...
PM Modi: పీఎం మోదీ అమెరికా పర్యటన సెప్టెంబర్ నెలాఖారులో జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాషింగ్టన్, న్యూయార్క్ లకు వెళ్లి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ను కలవనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాత మోడీ వెళ్తున్న తొలి పర్యటన ఇదే. షెడ్యూల్ కోసం ప్రయత్నిస్తుండగా.. పర్యటనకు చర్చలు కుదిరితే సెప్టెంబర్ 22 నుంచి 27తేదీల మధ్యలో వెళ్లనున్నారు.
మోడీకి బైడెన్తో తొలి పర్సనల్ మీటింగ్ కూడా ఇదే. గతంలో మూడు సార్లు వర్చువల్ మీటింగ్ లలోనూ పాల్గొన్నారు. జీ7 సదస్సులో భాగంగా యూకేకు వెళ్లి బైడెన్ కలవాలనుకున్న మోడీ మీటింగ్ రద్దు అయింది. ఆ సమయంలో భారత దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో అలా జరిగింది. అఫ్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులపైన కూడా మోదీ చర్చించనున్నట్లు తెలుస్తుంది.
చివరిసారిగా సెప్టెంబర్ 2019లో పర్యటించిన మోదీ.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో కలిసి హౌడీ మోడీ ఈవెంట్ లో పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. మోడీ, బైడెన్ తో పాటు మరో ఇద్దరు మీటింగ్ కు హాజరవుతారట. కాకపోతే ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని సుగా వర్చువల్ గా పాల్గొంటారు.