మోడీకి నిత్య పూజలు..హారతులు : ఆయనే మా దేవుడు

  • Published By: veegamteam ,Published On : April 22, 2019 / 04:13 AM IST
మోడీకి నిత్య పూజలు..హారతులు : ఆయనే మా దేవుడు

ప్రధాని నరేంద్ర మోడీని భగవంతుడిలా కొలుస్తున్నారు. అంతేకాదు దేవుడికి చేసినట్లుగానే నిత్యం పూజలు చేస్తు మంగళహారతులిస్తున్నారు. మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ లోని వందలాది కుటుంబాల వారు మోడీని పూజిస్తున్నారు. 
Also Read : చిచ్చు పెట్టిన కుక్క : మహిళలను చితక్కొట్టిన కాంగ్రెస్ లీడర్

మోర్బీ జిల్లాలోని భోజ్పరావాదీ వసాహత్ బస్తీలోని 200 ఇళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను పెట్టి పూజలు చేస్తున్నారు. మోడీనే తాము దేవుడిలా భావిస్తున్నామనీ అందుకే పూజలు చేస్తున్నామంటున్నారు. తమ పిల్లలు చదువుకునేందుకు స్కూలు ఏర్పాటు చేయటమేకాక తమ గ్రామంలోని అందరికి ఇళ్ళ కట్టిస్తామని మోదీ హామీ ఇచ్చారని చెబుతున్నారు. పాములు పట్టి వాటిపైనే జీవనంసాగించే వీరంతా మోడీని దేవుడిలా కొలుస్తున్నారు. వారంతా పాములు పట్టటం మానేసి స్కూలుకు వెళ్లి చదువుకోవాలని చెప్పారటం. దీంతో వసాహత్ బస్తీవారంతా మోడీ భక్తులుగా మారిపోయారు. 

అంతేకాదు మోడీకి వారు చదువుకునే స్కూల్ వద్ద ఓ మందిరం కూడా నిర్మించారు.ఉదయం, సాయంత్రం వేళ్లలో పూజలు, హారతులు చేస్తున్నారు. చిన్నారులంతా మోడీకి దణ్ణం పెట్టుకున్నాకనే స్కూలుకు వెళుతున్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన స్కూల్లో కరెంట్,వాటర్ ఫెసిలిటీస్ తో పాటు 20 కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇలా మోడీకి స్వంత రాష్ట్రంలో భక్తులు ఏర్పడిపోయారు.
Also Read : ఒకే కాన్పులో నలుగురు పిల్లలు: అందరూ క్షేమం