మనీలాండరింగ్ కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2019 / 04:22 PM IST
మనీలాండరింగ్ కేసులో వాద్రాకు ముందస్తు బెయిల్

మ‌నీలాండ‌రింగ్ కేసులో సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు సోమవారం(ఏప్రిల్-1,2019) స్పెష‌ల్ సీబీఐ కోర్టు షరతులతో కూడిన ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.వాద్రా స‌న్నిహితుడు మ‌నోజ్ అరోరాకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం ఈ కేసులో ఇద్ద‌రూ మ‌ధ్యంత‌ర బెయిల్‌ పై ఉన్నారు. ముంద‌స్తు బెయిల్ కోసం ఇద్ద‌రూ 5 ల‌క్ష‌ల ప‌ర్స‌న‌ల్ బాండ్ల‌ను స‌మ‌ర్పించాలని కోర్టు తెలిపింది.

కోర్టు అనుమ‌తి లేకుండా దేశం విడిచి వెళ్ల‌కూడదని జడ్జి అరవింద్ కుమార్ వాద్రాకు సూచించారు.విచారణ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరవ్వాలని సూచించింది. ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ ల‌భించ‌డం ఒక‌ర‌కంగా వాద్రాకు పెద్ద ఊర‌ట అని చెప్పవచ్చు.