SCO సమ్మిట్ : చైనాపై మోడీ మాటల దాడి
PM’s Message At Regional SCO Meet షాంఘై సహకార సంస్థ(SCO)20వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-10,2020)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలా నెలల గ్యాప్ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్- మోడీ మధ్య జరిగిన మొదటి మీటింగ్ ఇదే కావడం విశేషం.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఎకానమీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మోడీ వ్యాఖ్యానించారు.కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి విసిరిన సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. సరిహద్దుల్లో చైనా ఆగడాలు,పెరుగుతున్న ఉగ్రవాదం వంటి విషయాలను ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా పరోక్షంగా చైనా,పాక్ ను ఉద్దేశించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.
ద్వైపాక్షిక అంశాలను ఈ వేదికపై ప్రస్తావించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటం దురదృష్టకరమని మోడీ అన్నారు. ఇది ఎస్సీఓ చార్టర్ కు, షాంఘై స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. షాంఘై సహకార సంస్థతో భారత్ కు బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశాల మధ్య సంబంధాలు నెలకొల్పడం చాలా ముఖ్యమని, అయితే ఇతరుల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని హితవు పలికారు.
It is unfortunate that there are unnecessary attempts to bring bilateral issues in the SCO agenda, which is in violation of SCO Charter and Shanghai spirit: Prime Minister Narendra Modi at the 20th Summit of SCO Council of Heads of State pic.twitter.com/AYc0w5FSKe
— ANI (@ANI) November 10, 2020