దరిద్రుడా.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ, పెళ్లి వేడుకలో దారుణం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని భోజ్‌పూర్ ఏరియాలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో ఓ యువకుడు నీచానికి పాల్ప‌డ్డాడు. అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేశాడు. పెళ్లి వేడుకలో రోటీలు తయారు చేసేందుకు వచ్చిన అతడు, తాను తయారు చేసిన ప్రతి రోటీపై ఉమ్మివేశాడు. ఆ తర్వాత వాటిని పొయ్యి మీద కాల్చాడు.

దరిద్రుడా.. ఉమ్మివేస్తూ రోటీల తయారీ, పెళ్లి వేడుకలో దారుణం

Spits On Rotis

man spits on rotis before cooking: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని భోజ్‌పూర్ ఏరియాలో దారుణం జరిగింది. పెళ్లి వేడుకలో ఓ యువకుడు నీచానికి పాల్ప‌డ్డాడు. అతిథులు తినాల్సిన రోటీలపై ఉమ్మివేశాడు. పెళ్లి వేడుకలో రోటీలు తయారు చేసేందుకు వచ్చిన అతడు, తాను తయారు చేసిన ప్రతి రోటీపై ఉమ్మివేశాడు. ఆ తర్వాత వాటిని పొయ్యి మీద కాల్చాడు.

కాగా, ఈ దారుణాన్ని గ‌మ‌నించిన ఓ వ్య‌క్తి సీక్రెట్‌గా త‌న ఫోన్‌ కెమెరాలో రికార్డ్ చేశాడు. ఆ త‌ర్వాత ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేశాడు. అంతే, ఈ వీడియో సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌ అయ్యింది. ఆ నీచుడు చేసిన పని చూసి అంతా విస్తుపోతున్నారు. వాడు మనిషేనా అని బూతులు తిడుతున్నారు. వాడు మనిషా లేక సైకోనా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన ఘజియాబాద్ పోలీసులు ఆ నీచుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

ఈ రోటీలను పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులు తిన్నారో లేదో తెలీదు కానీ.. ఉమ్మి వేసిన రోటీల వ్యవహారం తెలిసి షాక్ కి గురయ్యారు. కొందరు వాంతుల కూడా చేసుకున్నారు. నీచుడా, దరిద్రుడా, నికృష్టుడా అని.. వాడిని తెగ తిడుతున్నారు. ఒకవేళ వాడికి కనుక కరోనా ఉండి ఉంటే, ఊహకందని రీతిలో అనర్థం జరిగి ఉండేదని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మి వేస్తూ రోటీలు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలని పెళ్లి వేడుకకు వచ్చిన వారితో పాటు వీడియో చూసిన వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అసలే ఇది కరోనా సమయం. కొన్ని రోజులుగా విపరీతంగా కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తుల వల్ల మరింత ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.