OMG : కుప్పకూలిన డ్రైనేజీ పుట్ పాత్
రాజస్థాన్ లోని సిరోహిలో డ్రైనేజ్ కాలువపై నిర్మించిన ఫుట్పాత్ కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే పార్క్ చేసిన బైకులతో సహా ఇద్దరు వ్యక్తులు శిథిలాల్లో కూరుకుపోయారు. అది గమనించిన కొంతమంది వారికి రక్షించారు. వారిద్దరికి గాయలు కాగా..సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు.
మార్కెట్ లో వస్తువులు కొనేందుక వచ్చిన ఈ ఇద్దరి వ్యక్తులు నజీర్ మొహ్మద్, పర్వేజ్ ఖాన్ లుగా గుర్తించారు. ఈ వంతెన కూలిన అనూహ్యంగా కూలిపోయింది. ఈ ఘటనలో రెండు మోటార్ బైక్ కు కూడా కాలువలో పడ్డాయి. బైక్లలో ఒకదాన్ని బయటకు తీయగా, రెండవది శిధిలాలలో తీసేందుకు వీలుకాకుండా చిక్కుకుంది.
ఈ సంఘటన గురించి సమాచారం అందుకోవడంతో మునిసిపల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేంద్ర సింగ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్ధారామ్ బిష్ణోయ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
#WATCH: Portion of a footpath built over a drain, collapsed yesterday in Sirohi; 2 injured. #Rajasthan pic.twitter.com/4Ja6pgEt94
— ANI (@ANI) October 26, 2019