PK on Rahul: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు..

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు.

PK on Rahul: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ప్రశాంత్ కిషోర్ సెటైర్లు..

Rahul Gandhi

PK on Rahul: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగింది. కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ పాదయాత్రకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం రాహుల్ భారత్ జోడో యాత్ర హర్యానా మీదుగా సాగుతోంది. హర్యానా నుంచి యాత్ర పంజాబ్‌లోకి ప్రవేశించనుంది. రాహుల్ మాట్లాడుతూ.. భారత దేశంలో భయాందోళనలకు ప్రజలు గురవుతున్నారని, ఒక మతంతో మరో మతంతో పోరాడేలా చేస్తున్నారని, వీటన్నింటికి వ్యతిరేకంగానే నేను ఈ భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగిందని రాహుల్ తెలిపారు.

Rahul Gandhi To Lord Ram: రాహుల్ గాంధీ రాముడట, భారత్ జోడో యాత్ర రామాయణమట.. కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ (పీకే) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ బీహార్ రాష్ట్రంలోని జన్ సురాజ్ అభిమాన్ పేరుతో పర్యటిస్తున్నారు. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈక్రమంలో ఓ విలేకరి రాహుల్ గాంధీలా భారీ పాదయాత్ర చేపడుతారా అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన ప్రశాంత్ కిషోర్ రాహుల్ పాదయాత్రపై సెటైర్లు వేశారు.

 

రాహుల్ గాంధీ 3,500 కిలో మీటర్లు సుదీర్ఘ యాత్ర జరుపుతున్నారని, కిలో మీటర్లతో తనకు పట్టింపు లేదని అన్నారు. గత అక్టోబర్ నుంచి తాను నాన్ స్టాఫ్‌గా పర్యాటన కొనసాగిస్తున్నానని, కానీ ఆయనలా ? ఫిజికల్ ఫిట్‌నెస్ ప్రదర్శించడం లేదని అన్నారు. తానేమీ పెద్ద మనిషిని కాదని, ఆయనతో పోల్చితే తాను చాలా చిన్నవాడినని ప్రశాంత్ కిషోర్ అన్నారు.