CDS Rawat Pre-Recorded Video : రావత్ చివరి సందేశం వీడియో రిలీజ్

1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా,భారత్-బంగ్లాదేశ్ 50 ఏళ్ల స్నేహానికి గుర్తుగా 'స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్​' వేడుకలను ఢిల్లీలోని ఇండియా గేట్​ వద్ద

CDS Rawat Pre-Recorded Video :  రావత్ చివరి సందేశం వీడియో రిలీజ్

Rawat

CDS Rawat Pre-Recorded Video :  1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా,భారత్-బంగ్లాదేశ్ 50 ఏళ్ల స్నేహానికి గుర్తుగా ‘స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్​’ వేడుకలను ఢిల్లీలోని ఇండియా గేట్​ వద్ద నిర్వహించారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆదివారంఉదయం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా…ఈ కార్యక్రమంలో దేశ తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చివరి వీడియో రికార్డును ప్రసారం చేశారు. డిసెంబర్ 7న రికార్డు చేసిన ఈ వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ వీడియో ద్వారా.. ఆ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు రావత్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. వీరసైనికులకు సేవలను స్మరించుకున్నారు.

కాగా, 1971లో తూర్పు పాకిస్థాన్‌లో స్వతంత్ర పోరు మొదలై భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీసింది. ఇందులో పాక్‌ను భారత్‌ ఓడించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 16న విజయ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. ఆ​ యుద్ధంలో భారత్‌ విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘స్వర్ణ విజయ సంవత్సరం’గా పేర్కొంటూ ఏడాది పాటు దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహిస్తున్నారు.

ఆదివారం ఉదయం ఇండియా గేట్ వద్ద స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నరక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని తొలుత ఘనంగా నిర్వహించాలని భావించినా.. దేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్​ రావత్​ అకాల మరణంతో నిరాడంబరంగా జరుపుతున్నట్లు రాజ్​నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా రావత్​ను స్మరించుకుంటూ నివాళులర్పించారు. స్వర్ణిమ్​ విజయ్‌ పర్వ్ వేడుక దక్షిణాసియా చరిత్ర, భౌగోళిక స్థితిని మార్చిన భారత సైన్యం అద్భుతమైన విజయాన్ని గుర్తు అని, 1971 యుద్ధంలో అమరులైన ప్రతి సైనికుడి ధైర్యానికి, పరాక్రమానికి, త్యాగానికి నమస్కరిస్తున్నాను అని రాజ్​నాథ్ తెలిపారు. ఆ ధైర్యవంతులందరి త్యాగానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు.

ఈ యుద్ధం మన నైతికతకు, మన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు, న్యాయంగా వ్యవహరించడానికి అద్భుతమైన ఉదాహరణ అని అన్నారు. యుద్ధంలో మరొక దేశాన్ని ఓడించిన తర్వాత.. మనలాంటి దేశం దానిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించలేదని, ఆ అధికారాన్ని దానికే అప్పగించిందని, ఇది చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుందని రాజ్​నాథ్ తెలిపారు.

ALSO READ Swarnim Vijay Parv : ఇండియా గేట్ వద్ద “స్వర్ణిమ్ విజయ్ పర్వ్” ప్రారంభించిన రాజ్‌నాథ్