PM Modi Comments On 6G Network : దేశంలో 6జీ నెట్వర్క్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
భారత్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్ధం చివరి నాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈవెంట్లో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
PM Modi Comments On 6G Network : భారత్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా 6జీ సర్వీసులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్ధం చివరి నాటికి దేశంలో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈవెంట్లో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.
ఈ దశాబ్ధం చివరి నాటికి 6జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేపడతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. గేమింగ్, వినోద రంగాల్లో భారత సొల్యూషన్స్ కోసం ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. అంతకుముందు టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ 5జీ సేవలు అక్టోబర్ 12 నాటికి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. టెలికాం ఆపరేటర్లు ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు చేశారని వెల్లడించారు.
PM Modi: శత్రువులు ఊహించలేని ఆయుధాలు మా దగ్గరున్నాయి: ప్రధాని మోదీ
ఇన్స్టలేషన్స్ జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. అక్టోబర్ 12 నాటికి 5జీ సేవలు ప్రారంభమవుతాయని, ఆపై దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాలకు విస్తరిస్తాయని పేర్కొన్నారు. మొదటగా ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూర్, హైదరాబాద్, గురుగ్రాం, లక్నో, కోల్కతా, ముంబై సహా 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.