లాల్ బహదూర్ శాస్త్రి జయంతి…నివాళులర్పించిన ప్రధాని

  • Published By: venkaiahnaidu ,Published On : October 2, 2019 / 04:17 AM IST
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి…నివాళులర్పించిన ప్రధాని

నేడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా విజయ్ ఘాట్ లో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కూడా మోడీ వెంట కలిసి వెళ్లి లాల్ బహదూర్ శాస్త్రికి నివాళులర్పించారు.

వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు విజయ్ ఘాట్  కి వెళ్లి శాస్త్రికి నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శాస్త్రికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి విజయ్ ఘాట్ లో తన తండ్రికి నివాళులర్పించారు.ఇవాళ గాంధీ జయంతి కూడా కావడంతో లాల్ బహదూర్ శాస్త్రికి..గాంధీజికి సంబంధించిన కొన్ని ఫోటోలను..వీడియోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.