చైనా దూకుడు.. కరోనాపై యుద్ధం.. జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ

  • Published By: vamsi ,Published On : June 30, 2020 / 07:08 AM IST
చైనా దూకుడు.. కరోనాపై యుద్ధం.. జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ

కరోనాపై కొనసాగుతున్న యుద్ధం మరియు చైనా సరిహద్దులో ఉద్రిక్తతల మధ్య, ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం(30 జూన్ 2020) సాయంత్రం 4 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని అయినప్పటి నుంచి ప్రధాని మోడీ ఇప్పటివరకు 12 సార్లు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఇవాళ ఆయన 13వ సారి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఒక వైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గణాంకాలు పెరుగుతుండగా.. మరోవైపు గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణలు తర్వాత చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం చాలా ముఖ్యమైనదిగా చెబుతున్నారు.

అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కరోనా నుండి హరికేన్, మిడుత దాడి వరకు లడఖ్‌లో మరణించిన సైనికుల గురించి ప్రస్తావించారు. వందలాది మంది ఆక్రమణదారులు దేశంపై దాడి చేశారని ప్రధాని మోడీ చెప్పారు, అయితే భారతదేశం ఎప్పుడూ బయటపడుతూనే ఉంది అని ఆయన చెప్పారు. అదే సమయంలో, చైనా పేరు ఎత్తకుండా లడఖ్‌లో భారతదేశం వైపు కళ్ళు ఎత్తి చూస్తున్న వారికి తగిన సమాధానం లభించిందని ప్రధాని మోడీ అన్నారు.

కరోనా సంక్షోభ సమయంలో దేశం లాక్‌డౌన్ నుంచి బయటపడిందని మోడీ చెప్పుకొచ్చారు. ఈ సమయంలో రెండు విషయాలకు శ్రద్ధ అవసరం. కరోనాను ఓడించడం. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి దానికి బలం ఇవ్వడం అని అన్నారు.