ఆశ్చర్యపరిచిన ప్రియాంక గాంధీ: తానే స్వయంగా వంటగదిలోకి వెళ్లి!

  • Published By: vamsi ,Published On : April 22, 2019 / 12:33 PM IST
ఆశ్చర్యపరిచిన ప్రియాంక గాంధీ: తానే స్వయంగా వంటగదిలోకి వెళ్లి!

ఆమె మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు వణుకుతాయ్.. ఆమె ప్రచారం చేస్తుంటే పార్టీ శ్రేణులు ఆనందపడుతాయ్.. ఆమె వస్తుందంటే చుట్టూ జనమే.. అయినా కూడా ఆమె ఒక సాధారణ స్త్రీ మాదిరిగా వంటింట్లోకి వెళ్లి కట్ చేసిన పండ్లను తీసుకుని వచ్చి అందరికీ కూర్చోబెట్టి స్వయంగా వడ్డిస్తే కాస్త ఆశ్చర్యమే కదా? ఇదే జరిగింది కేరళలో. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా దేశం మొత్తం తిరుగుతున్న ప్రియాంక గాంధీ చేసిన ఇటువంటి పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనుకోకుండా తన ఇంటికి ప్రియాంకగాంధీ రావడంతో ఆమె ఆశ్యర్యపోయింది. 
Also Read : BJD MLA అభ్యర్థిపై బాంబు దాడి..

ఇందిరా గాంధీ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రియాంకగాంధీ ఇటీవల కేరళలలోని వాయినాడ్‌‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించింది. ఈ సంధర్భంగా ఆమె ట్రైబల్ యువతి అయిన సివిల్స్ టాపర్ శ్రీ ధన్య ఇంటికి వెళ్లింది.అలాగే వీరజవాన్ వసంత్ కుమార్ ఇంటికి వెళ్లిన ప్రియాక గాంధీ ఇంట్లోని వంట గదిలోకి వెళ్లి అక్కడ తినేవాటిని తెచ్చి టేబుల్‌పై పెట్టి తనే స్వయంగా అక్కడివాళ్లకు పెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేశ నేతే అయినా ఇల్లాలే కదా? అందుకే ఇలా చేసింది అంటూ నెటిజన్లు ఆమెను పొగుడుతున్నారు.

ఇక ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం కావడంతో ప్రియాంకను రంగంలోకి దింపింది. తూర్పు యూపీ బాధ్యతలు ఇవ్వగా ఆమె దేశం మొత్తం తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రివైవల్‌కు ప్రియాంకా గాంధీ ఆగమనం చాలా ముఖ్యం. యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలయిక వల్ల ఇప్పుడు కాంగ్రెస్ బలం చాలావరకు తగ్గినట్లే.. కాంగ్రెస్ ప్రియాంక అస్త్రంతో ఓట్లను తెచ్చుకోగలిగితే.. అది బీజేపీకి ఇబ్బందికరం అవుతుంది. అంటే.. కాంగ్రెస్ బేస్ పెంచుకోవడం.. బీజేపీకి సీట్లు రాకుండా చేయడం.. ప్రియాంకా రాజకీయ రంగ ప్రవేశంలో కీలకం. దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ పోలికలతో ఉన్న ప్రియాంక గాంధీ తిరగడంతో ఆ పార్టీ క్రేజ్ పెరుగుతుందని భావిస్తుంది

Also Read : ఏపీలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమే : గోరంట్ల