కాన్వాయ్ ఆపి మోడీ మద్దుతుదారులను సర్‌ప్రైజ్ చేసిన ప్రియాంక

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2019 / 06:12 AM IST
కాన్వాయ్ ఆపి మోడీ మద్దుతుదారులను సర్‌ప్రైజ్ చేసిన ప్రియాంక

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో సోమవారం ప్రియాంక గాంధీ పర్యటించిన సమయంలో  ఆశక్తికర పరిణామం చోటు చేసుకుంది.ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీలో పాల్గొనేందుకు ఓ రద్దీ రోడ్డు గుండా ప్రియాంక వెళ్తున్న సమయంలో కొంతమంది రోడ్డు పక్కన నిలబడి మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు.

మోడీ నినాదాలు చేసినవారిలో యువకులు కూడా ఉన్నారు. వారు నినాదాలు చేయడం గమనించిన ప్రియాంక దీంతో సడన్‌గా కాన్వాయ్ నుంచి దిగి మోడీ మద్దతుదారుల దగ్గరకు వెళ్లి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ప్రియాంక మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి..నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉంటా అంటూ వారికి ప్రియాంక ఆల్ ది బెస్ట్ చెప్పారు. బీజేపీ మద్దుతుదారులలో కొందరు ప్రియాంకతో ఫోటోలు దిగారు.