ఏందీ రచ్చ : రాహుల్ కి హోంశాఖ నోటీసుపై ప్రియాంక ఫైర్

  • Published By: venkaiahnaidu ,Published On : April 30, 2019 / 09:31 AM IST
ఏందీ రచ్చ : రాహుల్ కి హోంశాఖ నోటీసుపై ప్రియాంక ఫైర్

పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్ లో రాహుల్ పుట్టడం.పెరగటం ఇవన్నీ ప్రజలు చూశారని ఆమె అన్నారు.అలాంటప్పుడు ఈ రచ్చ ఏంటని ఆమె ప్రశ్నించారు.

రాహుల్ గాంధీకి బ్రిటన్, భారత్…రెండు దేశాల పౌరసత్వాలు కలిగి ఉన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే,రాహుల్‌ గాంధీకి నాలుగు పాస్‌పోర్ట్‌ లు ఉన్నాయని, ఒకదానిపై ఆయన పేరు రౌల్‌ విన్సీగా ఉందంటూ సుబ్రహ్మణ్య స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు.ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన హోంశాఖకు అందజేశారు.ఈ విషయంలో మంగళవారం(ఏప్రిల్-30,2019)రాహుల్ గాంధీకి హోంశాఖ నోటీసు జారీ చేసింది.రెండు వారాల్లోగా పౌరసత్వంపై వివరణ ఇవ్వాలని రాహుల్ ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.&