కేంద్రం “పాజిటివిటీ” వ్యూహంపై రాహుల్,పీకే ఫైర్

కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో దేశంలో మరియు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కొత్త పొలిటికల్ ఫ్లాష్ పాయింట్

కేంద్రం “పాజిటివిటీ” వ్యూహంపై రాహుల్,పీకే ఫైర్

Propaganda Rahul Gandhi Prashant Kishor On Centres Positivity Push

Positivity కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో దేశంలో మరియు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కొత్త పొలిటికల్ ఫ్లాష్ పాయింట్..”పాజిటివిటీ” మంత్రాన్ని పఠిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది ఒకరి తలను ఇసుకలో కూర్చివేయడమేనని,ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. దేశంలో వేలమంది కరోనా బాధితులు, హెల్త్ కేర్ వర్కర్లు తమ అత్యంత ఆప్తులను కోల్పోయి అల్లాడుతుంటే.. దాదాపు హాస్పిటల్స్ అన్నీ ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత, ఇతర కోవిడ్ మందులు లేక దిక్కులు చూస్తుంటే ..ఈ తరుణంలో పాజిటివిటీ థింకింగ్ అనడం జోక్ కాక ఇంకేంటని రాహుల్ ట్వీట్ చేశారు.

ఇక, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కేంద్రం తీరుపై మండిపడ్డారు. మన చుట్టూ దు:ఖిస్తున్న దేశం మరియు విషాద పరిస్థితుల నేపథ్యంలో “పాజిటివిటీ” పేరిట నిరంతర తప్పుడు ప్రచారం అసహ్యంగా ఉందని పీకే తన ట్వీట్ లో తెలిపారు. పాజిటివ్ గా ఉండటానికి..మనం ప్రభుత్వానికి గుడ్డి ప్రచారకులుగామారవలసిన అవసరం లేదని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. కరోనా రెండో దశ హ్యాండిల్ విషయంలో మోడీ ప్రభుత్వంపై దేశంలోనూ,అంతర్జాతీయంగా పెద్దఎత్తున వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు బీజేపీ,ఆర్ఎస్ఎస్ పాటిస్తున్న వ్యూహాన్ని ఖండిస్తూ రాహుల్ గాంధీ,పీకే ఇలా ట్వీట్ల చేశారు.

కాగా, గత వారం… ప్రభుత్వం అనుసరిస్తున్న పాజిటివిటీ వ్యూహాన్ని హైలైట్ చేసేందుకు నిర్వహించిన వర్క్ షాప్ కు సంయుక్త కార్యదర్శి హోదాగల అధికారులతో సహా పలువురు కేంద్రప్రభుత్వ అధికారులను కూడా ఇందులో పాల్గొనేలా ప్రభుత్వం చూసింది. ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఏర్పాటు చేశామని, ఇంకా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రులు ట్వీట్లు చేస్తూ వచ్చారు. ప్రధాని మోడీ నెలవారీ రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” అధికారిక ట్విట్టర్ ఖాతాలో పాజిటివిటీ గురించి ప్రస్తావించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు మంగళవారం రాసిన 4 పేజీల లేఖలో కరోనా కట్టడికి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందో వివరించారు. అంతేకాకుండా,ఆర్ఎస్ఎస్… ‘పాజిటివిటీ ఆన్ లిమిటెడ్’ పేరిట ఓ ఆన్ లైన్ ఈవెంట్ ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రముఖ మత గురువులు, పారిశ్రామికవేత్తలతో ఆన్ లైన్ ప్రసంగాలను టీవీ ద్వారా నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ యోచిస్తోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం.