Pulwama encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం

పుల్వామాలోని పాహూ ఏరియాలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాహూ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

Pulwama encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు తీవ్రవాదులు హతం

Pulwama

Pulwama encounter: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. పుల్వామాలోని పాహూ ఏరియాలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాహూ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు తమ కోసం వెతకడం గుర్తించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు.

Modi Jammu Kashmir Tour : జమ్మూకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిన్న శనివారం కూడా కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఆదివారం కాశ్మీర్‌ ప్రాంతంలో మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ భద్రతను మరింత పెంచారు.