కరోనా వ్యాక్సిన్ టెస్టింగ్ కోసం NIVకి 30 కోతులు
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన తయారు చేయటానికి ప్రపంచంలోని సైంటిస్టులంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈక్రమంలో పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కూడా కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. ఈ క్రమంలో వారు తయారు చేసిన టీకాను పరీక్షించడానికి అటవీశాఖ నుండి 30 కోతులు కావాలని ఎన్ఐవి ప్రభుత్వాన్ని కోరింది. దీనికి ప్రభుత్వ పర్మిషన్ కూడా లభించింది. దీంతో అటవీశాఖ వారు కోవిడ్ -19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ కోసం 3 నుంచి 4 ఏళ్ల మధ్య వయసు గల 30 కోతులను ఎన్ఐవికి అటవీశాఖ అప్పగించనుంది.
ఈ కోతులు పూణే జిల్లాలోని వడ్గావ్ అడవి ప్రాంతం నుంచి తీసుకురానున్నారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ను మొదట కోతులపై పరీక్షిస్తారని..దీని కోసం ప్రభుత్వం అనుమతి మేరకు కోతులను పంపనున్నామని రాష్ట్ర అటవీ మంత్రి సంజయ్ రాథోడ్ తెలిపారు. దీనికి అటవీశాఖ అధికారులు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు. తాము ఇచ్చిన ఆ కోతులను ఎన్ఐవి జాగ్రత్తగా చూసుకోవాలని షరతు పెట్టామని తెలిపారు.
కాగా..దేశంలోని కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. ఈ క్రమంలో గత 24 గంటల్లో 103 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 2 వేల 287 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 72,300కు చేరింది. ఇక్కడ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 2వేల 465 మంది మృతి చెందారు. ఈ మొత్తం మరణాలలో ముంబైలోనే అధికంగా ఉన్నాయి.
Read: ఐడియా అదిరింది…ప్రయాణంలో వైరస్ నుంచి రక్షణ