Punjab : పటియాలా లా యూనివర్సిటీలో కరోనా కలకలం..60మంది విద్యార్ధులకు పాజిటివ్

దేశంలో మరోసారి కరోనా కంగారు పుట్టిస్తోంది. వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా (RGNUL) లో కరోనా కలకలం సృష్టించింది. వర్శిటిలో 60 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Punjab : పటియాలా లా యూనివర్సిటీలో కరోనా కలకలం..60మంది విద్యార్ధులకు పాజిటివ్

Covid Cases In Patiala Law University

covid cases in patiala law university : దేశంలో మరోసారి కరోనా కంగారు పుట్టిస్తోంది. వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా (RGNUL) లో కరోనా కలకలం సృష్టించింది. వర్శిటిలో 60 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆ యూనివర్సిటీని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. వారిని ప్రత్యేక గదుల్లో ఐసోలేషన్‌లో ఉంచారు. కోవిడ్ వ్యాప్తి అరికట్టటానికి మే 10కల్లా విద్యార్ధులు వర్శిటీ ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. మరోపక్క ఐఐటీ మద్రాస్‌లో ఇటీవల పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకింది. ప్రస్తుతం అక్కడ వైరస్‌ సోకిన వారి సంఖ్య 170కి చేరింది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 3,275 మంది వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది. ముందురోజు కంటే కేసులు స్వల్పంగా పెరిగాయి. వారంరోజుల క్రితం వరకు కొవిడ్ వ్యాప్తి తగ్గింది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా వెయ్యి లోపు నమోదయ్యాయి. వారం రోజుల నుంచి కొవిడ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతూ వచ్చింది. 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో మరోసారి కొవిడ్ వ్యాప్తి పెరుగుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. బుధవారం 3,010 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా కొనసాగుతోంది. క్రియాశీల కేసులు 19, 719(0.05)కి పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో కొవిడ్ తో చికిత్స పొందుతూ 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్లకు పైగా కేసులు రాగా 5.23 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ ను ముమ్మరం చేసింది. కాగా బుధవారం 13.98 లక్షల మంది టీకా వేయించుకోగా, మొత్తం ఇప్పటి వరకు 189 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఢిల్లీలో 1,354 మందికి వైరస్ సోకగా, పాజిటివిటీ రేటు 7.64 శాతానికి పెరిగింది. ముంబయిలో 117 కేసులు రాగా ఫిబ్రవరి 24 తరువాత ఇవే అత్యధికం కావడం గమనించాల్సిన విషయం.