ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పురంధేశ్వరి: పవన్ కళ్యాణ్ కూడా?

  • Published By: vamsi ,Published On : January 31, 2020 / 12:30 AM IST
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పురంధేశ్వరి: పవన్ కళ్యాణ్ కూడా?

ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని గట్టిగా నిర్ణయించుకుంది బీజేపీ. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రతీ సీటు మీద బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ సారి ఢిల్లీ పీఠం దక్కుంచుకొనేందుకు ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులకు ఢిల్లీలో గెలుపు బాధ్యతలను అప్పగించారు.

అందులో భాగంగానే తెలుగువారి ఓట్లను ఆకర్షించేందుకు తెలుగువారి ఓట్ల కోసం.. పురంధేశ్వరి వంటి నేతలతో అక్కడ ప్రచారం చేయిస్తున్నారు. లేటెస్ట్‌గా మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరిని అక్కడ ప్రచారంలో తిప్పుతున్నారు. ఢిల్లీలో తెలుగు, తమిళ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పురంధేశ్వరి, సినీనటి కవిత, మాలతి రాణి, పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇచ్చిన చాలా హామీలు అమలు కాలేదంటూ ఆప్ పార్టీని విమర్శించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. బీజేపీతో ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన క్రమంలో పవన్ కళ్యాణ్ చేత అక్కడ ప్రచారం చేయించాలని బీజేపీ భావిస్తుంది. రెండు పార్టీల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేస్తామని ఇరు పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధు ల గెలుపు ఓటములను తెలుగు వారే ప్రభావితం చేయనున్నారు. అందుకే బీజేపీ నిర్ణయం తీసుకుంది.